త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Gandhi | మోదీ ప్ర‌భుత్వానికి చీక‌టి రోజు.. ఈ ఫ‌లితం విప‌క్షాల ఐక్య‌త‌కు నిద‌ర్శ‌నం.. రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోవ‌డంపై ప్రియాంక గాంధీ

Priyanka Gandhi | చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఉద్దేశించి తెచ్చిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు (womens quota bill) లోక్‌స‌భ‌లో వీగిపోయిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తాజాగా స్పందించారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి ద‌క్కిన గొప్ప విజ‌యంగా అభివ‌ర్ణించారు.

D

National | Published On Apr 18, 2026, 1.48 pm IST

Priyanka Gandhi | మోదీ ప్ర‌భుత్వానికి చీక‌టి రోజు.. ఈ ఫ‌లితం విప‌క్షాల ఐక్య‌త‌కు నిద‌ర్శ‌నం.. రిజ‌ర్వేష‌న్ల బిల్లు వీగిపోవ‌డంపై ప్రియాంక గాంధీ
Advertisement

Priyanka Gandhi | చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఉద్దేశించి తెచ్చిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు (womens quota bill) లోక్‌స‌భ‌లో వీగిపోయిన విష‌యం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తాజాగా స్పందించారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి ద‌క్కిన గొప్ప విజ‌యంగా అభివ‌ర్ణించారు. ఈ ఫ‌లితం విప‌క్షాల ఐక్య‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అంతేకాదు, ఇది మోదీ ప్ర‌భుత్వానికి చీక‌టి రోజుగా అభివ‌ర్ణించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. "కేంద్రం తెచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయం. వారికి మాత్రం ఇది చీక‌టి రోజే. ఎందుకంటే వారు మొద‌టిసారి షాక్‌కు గుర‌య్యారు. ఈ ఫ‌లితంతో వారికి త‌గిన శాస్తి జ‌రిగింది. అధికార ప‌క్షం నేత‌ల ముఖాల్లో ఈ ఫ‌లితం తాలూకు ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిరూపితమైంది" అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర దాగుందని.. శాశ్వతంగా అధికారంలో ఉండేందుకే ఆ పార్టీ నేతలు ఈ రకమైన కుట్రలు పనుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే ఎన్డీయే ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగా పార్ల‌మెంటు ప్ర‌త్యేక సమావేశాల‌ను ఏర్పాటు చేసింద‌న్నారు. విప‌క్షాలు ఐక్యంగా ఆ కుట్ర‌ను అడ్డుకున్నాయ‌ని చెప్పుకొచ్చారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు ప్ర‌తిప‌క్షం వ్య‌తిరేకం కాద‌ని ఈ సంద‌ర్భంగా ప్రియాంక గాంధీ స్ప‌ష్టం చేశారు. దీన్ని డీలిమిటేష‌న్‌తో ముడిపెట్ట‌డం స‌రికాద‌న్నారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయటానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఉన్న‌ 543 సీట్లలోనే మహిళలకు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. "మీరు నిజంగా మహిళల కోసం ఏదైనా చేయాలనుకుంటే.. 2023 నాటి బిల్లును తిరిగి తీసుకురండి. దానికి మేము సంపూర్ణ‌ మద్దతు ఇస్తాము" అని ప్రియాంక స్ప‌ష్టం చేశారు.

Also Read..

యూట్యూబ్ షార్ట్స్ కు కొత్త అప్‌డేట్‌.. వీడియోల‌ను అస‌లు చూడ‌కుండా ఆపొచ్చు..

హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్‌ మూవీ - వైల్డ్ కాంబో సెట్‌

మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు.. పాత చ‌ట్టాన్నే అమ‌లు చేయాలంటూ ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌

Advertisement
Advertisement