PM Modi | భారత్ను గర్వపడేలా చేశారు.. స్కైరూట్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
PM Modi | ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్కైరూట్ బృందానికి మోదీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.
PM Modi | దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే స్కైరూట్ బృందానికి మోదీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. దేశం గర్వపడేలా చేశారంటూ కొనియాడారు.
విక్రమ్ రాకెట్ కక్షలోకి చేరిన వెంటనే సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో స్కైరూట్ సీఈవో, వ్యవస్థాపకులు పవన్కుమార్ చందన్కు మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. "మీరు భారత్ను గర్వపడేలా చేశారు. భారత ఆశయాలను అంతరిక్షంలో నిలబెట్టారు. యువత కలలకు బలమైన పునాది వేశారు" అని అన్నారు. ఈ ప్రయోగాన్ని తానూ వీక్షించినట్లు చెప్పారు. ఈ మిషన్ తొలి అడుగు మాత్రమేనని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా తనను కలవాలని స్కైరూట్ బృందాన్ని ప్రధాని ఆహ్వానించారు.
Also Read..
విద్యార్థుల భద్రతకై విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ
తాజావార్తలు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్లతో సాగే తెలుగు లవ్స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్లతో సాగే తెలుగు లవ్స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్






