త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో న‌లుగురు బాలిక‌లు అదృశ్యం

Girls Missing | సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్‌లో ఓ న‌లుగురు బాలిక‌లు( Girls Missing ) అదృశ్య‌మ‌య్యారు. స్కూల్‌కు వెళ్తున్నామ‌ని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Jul 26, 2026, 1.30 pm IST

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో న‌లుగురు బాలిక‌లు అదృశ్యం
Advertisement

Girls Missing | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్‌లో ఓ న‌లుగురు బాలిక‌లు( Girls Missing ) అదృశ్య‌మ‌య్యారు. స్కూల్‌కు వెళ్తున్నామ‌ని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం త‌ల్లిదండ్రులు గాలిస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన వ‌ల‌స కూలీలు ఇస్నాపూర్‌లో ఉంటూ జీవ‌నోపాధి పొందుతున్నారు. అయితే వ‌ల‌స కుటుంబాల‌కు చెందిన ఓ న‌లుగురు అమ్మాయిలు ఇస్నాపూర్ జిల్లా ప‌రిష‌త్ హై స్కూల్‌లో చ‌దువుకుంటున్నారు. ఈ నెల 23న ఎప్ప‌టి మాదిరిగానే విద్యార్థినులు స్కూల్‌కు వెళ్లారు. కానీ సాయంత్రం వ‌ర‌కు కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు బంధువుల నివాసాల్లో వెతికారు. కానీ ఆచూకీ ల‌భించ‌లేదు.

చివ‌ర‌కు చేసేదేమీ లే ఈ నెల 25న రాత్రి ప‌టాన్‌చెరు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అమ్మాయిల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇస్నాపూర్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Advertisement
Advertisement