Om Birla | సభ సజావుగా సాగేందుకు సహకరించండి.. రాజకీయ పార్టీలకు స్పీకర్ ఓం బిర్లా భావోద్వేగ విజ్ఞప్తి
Om Birla | వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో నిరంతరం గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అన్ని పార్టీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా, ఫలవంతంగా చర్చించేందుకు వీలుగా సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు తమ సహకారాన్ని అందించాలని కోరారు.
Om Birla | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో మూడు రోజుల్లో సమావేశాలు ముగియనున్నాయి. అయితే, ఈ సమావేశాలు ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. సభా కార్యకలాపాలు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కీలక విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.
వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో నిరంతరం గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సభ సజావుగా సాగేలా సహకరించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (Business Advisory Committee) భేటీలో స్పీకర్ ఓం బిర్లా అన్ని రాజకీయ పార్టీల నేతలని కోరారు. సభ గౌరవాన్ని కాపాడాలని ఆయన భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు సభ వేదిక కావాలని తెలిపారు. గందరగోళం వదిలి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా, ఫలవంతంగా చర్చించేందుకు వీలుగా సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు తమ సహకారాన్ని అందించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి : వీబీ జీరామ్జీ పథకం.. తొలి నెలలోనే సగానికి పడిపోయిన ఉపాధి పనిదినాలు
In the BAC today, pained by the deadlock in the House, the Speaker made an emotional appeal to floor leaders. Let the voice of the people be heard. Hold Question Hour. Discuss the key bills. Emphasizing the importance of constructive deliberations, meaningful participation and… pic.twitter.com/RnNnsxYl9T
— ANI (@ANI) August 10, 2026
అమిత్ షా సమాధానమిస్తారు : రిజుజు
మరోవైపు విద్యార్థుల నిరసనలు సహా ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా సమాధానం ఇస్తారని లోక్సభకు తెలిపారు. అయితే, చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి అంతరాయాలూ కలిగించకూడదని స్పష్టం చేశారు. హోంమంత్రి ప్రకటనకు ఆటంకం కలిగించేలా సభలో గందరగోళం సృష్టించకూడదని తెలిపారు.
Also Read..
విపక్షాల నిరసనల మధ్యే.. ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్సభ ఆమోదం
వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
ప్రభుత్వ వేదికపై పాలిటిక్స్ వద్దు: ఆ ఇండ్లు బరాబర్ కేసీఆర్ కట్టినవే
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tribunals Reforms Bill | విపక్షాల నిరసనల మధ్యే.. ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్సభ ఆమోదం
ఆగస్టు 10, 2026

Congress Whip | ఆ మూడురోజులు పార్లమెంట్కు రావాలి.. సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
ఆగస్టు 7, 2026

Kiren Rijiju | అమిత్ షా పేరు వింటేనే ఉగ్రవాదుల ఒంట్లో వణుకు.. ప్రతిపక్షాలకు కిరణ్ రిజుజు స్ట్రాంగ్ వార్నింగ్
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●KTR | పెద్ది అంతిమయాత్రకు ఓరుగల్లు మొత్తం కదిలింది.. ఆ చివరి ప్రయాణమే ఆయన జీవితానికి అసలైన కొలమానం
- ●రేవంత్రెడ్డి ముప్పై మాసాలు నిద్ర పోయిండు..
- ●Telangana Urdu Academy Land Lease | శేరిలింగంపల్లి ప్రైమ్ ల్యాండ్ లీజుకు బ్రేక్: ఉర్దూ అకాడమీ భూమిపై తెలంగాణ సర్కార్ కీలక జీవో
- ●Padi Kaushik Reddy vs Ponguleti Srinivas Reddy | ప్రభుత్వ వేదికపై పాలిటిక్స్ వద్దు: ఆ ఇండ్లు బరాబర్ కేసీఆర్ కట్టినవే
- ●Kiara Advani | టాక్సిక్ తర్వాత టాలీవుడ్ - మైథాలజీ మూవీలో కియారా అద్వానీ - రౌడీ బాయ్తో రొమాన్స్
- ●Tribunals Reforms Bill | విపక్షాల నిరసనల మధ్యే.. ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్సభ ఆమోదం

KTR | పెద్ది అంతిమయాత్రకు ఓరుగల్లు మొత్తం కదిలింది.. ఆ చివరి ప్రయాణమే ఆయన జీవితానికి అసలైన కొలమానం

రేవంత్రెడ్డి ముప్పై మాసాలు నిద్ర పోయిండు..

Telangana Urdu Academy Land Lease | శేరిలింగంపల్లి ప్రైమ్ ల్యాండ్ లీజుకు బ్రేక్: ఉర్దూ అకాడమీ భూమిపై తెలంగాణ సర్కార్ కీలక జీవో

Padi Kaushik Reddy vs Ponguleti Srinivas Reddy | ప్రభుత్వ వేదికపై పాలిటిక్స్ వద్దు: ఆ ఇండ్లు బరాబర్ కేసీఆర్ కట్టినవే



