త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Urdu Academy Land Lease | శేరిలింగంపల్లి ప్రైమ్ ల్యాండ్ లీజుకు బ్రేక్: ఉర్దూ అకాడమీ భూమిపై తెలంగాణ సర్కార్ కీలక జీవో

శేరిలింగంపల్లిలోని అత్యంత విలువైన ఉర్దూ అకాడమీ భూమిని ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది.

J

Hyderabad | Published On Aug 10, 2026, 4.43 pm IST

Telangana Urdu Academy Land Lease | శేరిలింగంపల్లి ప్రైమ్ ల్యాండ్ లీజుకు బ్రేక్: ఉర్దూ అకాడమీ భూమిపై తెలంగాణ సర్కార్ కీలక జీవో

సంక్షిప్త సారాంశం

శేరిలింగంపల్లిలోని దర్గా హుస్సేన్ షా వలీలో ఉన్న ఉర్దూ అకాడమీ భూమి (1.04 ఎకరాలు) లీజుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. N.N. ఇన్‌ఫ్రా అండ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు 30 ఏళ్ల పాటు భూమిని అప్పగిస్తూ ఇచ్చిన పాత జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది (Kept in abeyance). మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీఉల్లా ఈ మేరకు జూలై 27న G.O.Ms.No.22 ను విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ లీజు ప్రక్రియ ముందుకు సాగదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Telangana Urdu Academy Land Lease | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ అయిన శేరిలింగంపల్లి (Serilingampally) పరిధిలో ఉన్న అత్యంత విలువైన ఉర్దూ అకాడమీ (Urdu Academy) భూమి లీజు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూమిని ఓ ప్రైవేట్ కన్‌స్ట్రక్షన్ సంస్థకు లీజుకు ఇస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలకు బ్రేకులు వేసింది. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ జూలై 27, 2026 న అధికారిక ఉత్తర్వులు (G.O.) జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..

రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షా వలీ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 29 లో ఉర్దూ అకాడమీకి చెందిన 1.04 ఎకరాల (సుమారు 5220 చదరపు గజాలు) భూమి ఉంది. ఈ ప్రైమ్ ల్యాండ్‌ను హైదరాబాద్‌కు చెందిన M/s. N.N. ఇన్‌ఫ్రా & కన్‌స్ట్రక్షన్స్ (N.N. Infra & Constructions) అనే సంస్థకు 30 ఏళ్ల సుదీర్ఘ కాలానికి లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జూలై 16, 2026 న G.O.Ms.No.20 ద్వారా పర్మిషన్ కూడా ఇచ్చింది.

నిర్ణయం మార్చుకున్న సర్కార్..

అయితే, ఏమైందో ఏమో కానీ.. పది రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మునుపటి ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Kept in abeyance) ప్రకటిస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీఉల్లా తాజాగా G.O.Ms.No.22 ను రిలీజ్ చేశారు.

"తదుపరి ఆర్డర్స్ (Further Orders) వచ్చే వరకు ఈ లీజు వ్యవహారం పెండింగ్‌లోనే ఉంటుంది. ఈ విషయంపై తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి" అని తాజా జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.

కోట్ల రూపాయల విలువ చేసే ఈ ప్రైమ్ ప్రాపర్టీని ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై ఏవైనా అభ్యంతరాలు వచ్చాయా? లేక లీజు నిబంధనల్లో ఏమైనా మార్పులు చేయబోతున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement