Credit Cards Rewards | క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రివార్డుల్లో కోత.. కారణాలేంటి..?
Credit Cards Rewards | క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో లాభదాయకత తగ్గుతున్న నేపథ్యంలో బ్యాంకులు తమ రివార్డ్ ప్రోగ్రామ్లను క్రమంగా తగ్గిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కార్డ్ జారీ చేసే సంస్థలు ఖర్చులను నియంత్రించేందుకు రివార్డ్ పథకాలపై కోతలు విధిస్తున్నాయి.
Credit Cards Rewards | క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో లాభదాయకత తగ్గుతున్న నేపథ్యంలో బ్యాంకులు తమ రివార్డ్ ప్రోగ్రామ్లను క్రమంగా తగ్గిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కార్డ్ జారీ చేసే సంస్థలు ఖర్చులను నియంత్రించేందుకు రివార్డ్ పథకాలపై కోతలు విధిస్తున్నాయి. ప్రతి రూపాయి ఖర్చుపై లభించే రివార్డ్ పాయింట్ల సంఖ్యను తగ్గించడమే కాకుండా, రివార్డ్ పాయింట్ల విలువను కూడా తగ్గిస్తున్నాయి. అలాగే వాటి చెల్లుబాటు గడువును కూడా కుదిస్తున్నాయి. ప్రీమియం ప్రయోజనాలైన ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ కోసం రిడెంప్షన్ నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు అర్హత ప్రమాణాలను కూడా పెంచుతున్నాయి. బ్యాంకింగ్ అధికారులు ఈ నిర్ణయానికి పలు కారణాలను చెబుతున్నారు. గతంతో పోలిస్తే బకాయిలను వాయిదాలుగా కొనసాగించే కస్టమర్ల సంఖ్య తగ్గిపోవడంతో క్రెడిట్ కార్డులపై వడ్డీ ఆదాయం తగ్గుతోంది. అలాగే కొందరు వినియోగదారులు తక్కువ వడ్డీ ఉన్న పర్సనల్ లోన్ల ద్వారా తమ క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లిస్తున్నారు. దీంతో మొత్తం క్రెడిట్ కార్డ్ వ్యాపారం లాభదాయకతపై ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
బ్యాంకులకు నష్టం వస్తుందా..
వేగంగా విస్తరించిన దశలో కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు అత్యంత ఉదారమైన రివార్డ్ ప్రోగ్రామ్లను ప్రవేశపెట్టాయని, అయితే ఇప్పుడు కొందరు వినియోగదారులు బ్యాంకులకు తగిన ఆదాయం తీసుకురాకుండానే ఈ ప్రయోజనాలను గరిష్ఠంగా వినియోగించుకుంటున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రారంభ దశలో మార్కెట్ వాటాను పెంచుకోవడానికి అధిక రివార్డ్ రేట్లను అందించినప్పటికీ, ప్రస్తుతం నిధుల సమీకరణ వ్యయం అధికంగా ఉండటం, తక్కువ ఖర్చుతో డిపాజిట్లను సమీకరించడంలో బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల భారీ రివార్డులు అందించే క్రెడిట్ కార్డ్ ఉత్పత్తులను కొనసాగించడం కష్టంగా మారిందని వారు పేర్కొంటున్నారు.
కార్డును ఎక్కువగా వాడేవారికే..
పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ అత్యంత ప్రభావితమైన ప్రయోజనంగా మారిందన్నారు. అనేక బ్యాంకులు ఉచిత లౌంజ్ సందర్శనల సంఖ్యను తగ్గించాయని, లేదా నిర్దిష్ట స్థాయి ఖర్చు చేసిన వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించే విధానాన్ని అమలు చేశాయని చెప్పారు. కొన్ని ఎంట్రీ లెవల్ కార్డుల నుంచి ఈ సదుపాయాన్ని పూర్తిగా తొలగించినట్లు తెలిపారు. కార్డును చురుకుగా ఉపయోగించే కస్టమర్లకే ఈ ప్రయోజనాలను పరిమితం చేయడమే లక్ష్యమని వివరించారు. ప్రీమియం కార్డ్ హోల్డర్లు ఖర్చు పరిమితులను సులభంగా చేరుకోగలిగినా, తక్కువ వార్షిక రుసుము ఉన్న లేదా ప్రాథమిక కార్డులు ఉపయోగించే వారు లౌంజ్ యాక్సెస్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సి వస్తుందని చెప్పారు. కార్డ్లోని అంతర్గత ప్రయోజనాలపై ఆధారపడకుండా ఉచిత లౌంజ్ యాక్సెస్ అందించే పీబీ పాస్ వంటి సేవలు ఈ లోటును కొంత మేర భర్తీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఆధిపత్యం వహిస్తున్న హెచ్డీఎఫ్సీ..
భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్ ఇప్పటికీ కొన్ని పెద్ద బ్యాంకుల ఆధిపత్యంలోనే ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సుమారు 22-23 శాతం మార్కెట్ వాటాతో అత్యధిక క్రెడిట్ కార్డులు కలిగిన బ్యాంక్గా కొనసాగుతోంది. ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ప్రధాన కార్డ్ జారీదారులలో ఉన్నాయి. మే నెలలో కొత్త క్రెడిట్ కార్డుల జారీ పరంగా ఎస్బీఐ కార్డ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్బీఎల్ బ్యాంక్ మొత్తం రుణాల పోర్ట్ఫోలియోలో క్రెడిట్ కార్డుల వాటా సుమారు 18 శాతంగా ఉంది.
రివార్డు ప్రయోజనాల్లో కోతలు..
ఇప్పటికే పలు ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో కోతలు ప్రకటించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్పై రివార్డ్ పాయింట్లను తగ్గించడంతోపాటు ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ కోసం అవసరమైన ఖర్చు పరిమితిని పెంచింది. యాక్సిస్ బ్యాంక్ అకోర్ లైవ్ లిమిట్లెస్ కు రివార్డ్ పాయింట్ల బదిలీ సదుపాయాన్ని నిలిపివేసింది. ఫెడరల్ బ్యాంక్ కు చెందిన స్కాపియా క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో కూడా గణనీయమైన కోతలు విధించగా, ఎస్బీఐ కార్డ్స్ కూడా ఎంపిక చేసిన కొన్ని క్రెడిట్ కార్డ్ ఉత్పత్తులపై రివార్డులను తగ్గించింది. దూకుడుగా కొత్త కస్టమర్లను ఆకర్షించడం కంటే దీర్ఘకాలిక లాభదాయకతకే బ్యాంకులు ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్లను తిరిగి సమతుల్యం చేసే దిశగా బ్యాంకులు అడుగులు వేస్తున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
- ●Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే
- ●Fake 100 Rupee Note | మార్కెట్లోకి నకిలీ 100 రూపాయల నోట్లు.. ఒరిజినల్ నోటును సులభంగా ఎలా గుర్తించాలో చెప్పిన ఆర్బీఐ
- ●Badrinath Dham | బద్రీనాథ్లో విరాళాల స్వాహా.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- ●PM Modi International Awards | ప్రధాని మోదీకి 35 అంతర్జాతీయ పురస్కారాలు: ఏ దేశం నుంచి ఏ అవార్డు వచ్చిందంటే?
- ●Oil Palm Complex | ఖమ్మం జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ కాంప్లెక్స్

Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..

Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే

Fake 100 Rupee Note | మార్కెట్లోకి నకిలీ 100 రూపాయల నోట్లు.. ఒరిజినల్ నోటును సులభంగా ఎలా గుర్తించాలో చెప్పిన ఆర్బీఐ

Badrinath Dham | బద్రీనాథ్లో విరాళాల స్వాహా.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం






