త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Constitution Amendment Bill | డీలిమిటేష‌న్‌పై డివిజన్ కోరిన ప్ర‌తిప‌క్షాలు

Constitution Amendment Bill | మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా రూపొందించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును (Constitution Amendment Bill) స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌తిప‌క్షాలు డివిజన్ (Division) కోరాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదించాయి.

D

National | Published On Apr 16, 2026, 12.46 pm IST

Constitution Amendment Bill | డీలిమిటేష‌న్‌పై డివిజన్ కోరిన ప్ర‌తిప‌క్షాలు
Advertisement

Constitution Amendment Bill | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు వాడీవేడిగా కొన‌సాగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో కీల‌క బిల్లుల‌ను కేంద్రం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో (Lok Sabha) అధికార, విప‌క్ష స‌భ్యుల మధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. ఇక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా రూపొందించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును (Constitution Amendment Bill) స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌తిప‌క్షాలు డివిజన్ (Division) కోరాయి.

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదించాయి. దీనిపై ఓటింగ్ జ‌ర‌గాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా దీనిపై ఓటింగ్ నిర్వ‌హించారు. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డానికి అనుకూలంగా మెజారిటీ స‌భ్యులు ఓటు వేశారు. ఓటింగ్‌లో మొత్తం 436 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ బిల్లుకు అనుకూలంగా 251 మంది ఓటు వేశారు. 185 మంది వ్యతిరేకించారు.

ఓటింగ్ అనంతరం లోక్​సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. మూడు బిల్లులపై సుదీర్ఘ చర్చల అనంతరం రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరుగుతుందని స్పీకర్ తెలిపారు. బిల్లులపై సభ్యులు ఎన్ని గంటలు కోరినా చర్చ జరపవచ్చని చెప్పారు. సభలో సభ్యులందరికీ సమయం ఇస్తామని అన్నారు.

కీలక బిల్లులపై 12-18 గంటల పాటు చర్చ..

ఇక ఈ కీలక బిల్లులపై సభలో 12 గంటల పాటు చర్చ జరుగుతుందని, సభ్యులు అంగీకరిస్తే దీనిని 18 గంటల వరకు కూడా పొడిగించే అవకాశం ఉందని తెలిపారు కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు తెలిపారు. సుదీర్ఘ చ‌ర్చ‌లో భాగంగా పార్ల‌మెంట్ అర్ధ‌రాత్రి వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు ఓటింగ్ ఉంటుంద‌న్నారు.

Also Read..

రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ను ప్ర‌తిప‌క్షం బ‌హిష్క‌రిస్తుంది : జైరాం ర‌మేష్

రాజ్యాంగాన్ని ప్ర‌భుత్వం హైజాక్ చేయాల‌ని చూస్తోంది.. లోక్‌స‌భ‌లో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం

పార్లమెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు ప్రారంభం.. లోక్‌స‌భ ముందుకు మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీలిమిటేష‌న్ బిల్లులు

Advertisement
Advertisement