Plane Crashes | అస్సాంలో కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్.. పైలట్ మృతి..!
Plane Crashes | అస్సాంలో (Assam) ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన AN-32 రవాణా విమానం జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (Jorhat Air Force Station)లో ప్రమాదానికి గురైంది.
Plane Crashes | అస్సాంలో (Assam) ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన AN-32 రవాణా విమానం జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ (Jorhat Air Force Station)లో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కుప్పకూలిపోయింది. జెట్ కూలినట్లు ఐఏఎఫ్ కూడా ధృవీకరించింది. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా ప్రాణనష్టం జరిగిందా అనే వివరాలపై కూడా స్పష్టత లేదు. ఈ ప్రమాదంలో పైలట్ మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఐఏఎఫ్కు వర్క్హార్స్ లాంటిది
ఆంటనోవ్ ఏఎన్-32 (Antonov AN-32).. దృఢమైన, ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. ఇది భారత వైమానిక దళానికి వర్క్హార్స్ (workhorse) లాంటిది. భారతీయ అవసరాల కోసం సోవియేట్ యూనియన్ (Soviet Union) కాలంలో ఈ విమానాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. భారతీయ వైమానిక దళంలో సుమారు వంద వరకు ఏఎన్-32 ట్రాన్స్పోర్టు విమానాలు సేవలందిస్తున్నాయి.
అతి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం మెరుగైన రీతిలో పనిచేసేలా వీటిని రూపొందించారు. ఎత్తైన ప్రాంతాల్లో ఉండే విమానాశ్రయాల్లో, తీవ్రమైన ఉష్ణమండల వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 7.5 టన్నుల సరకును, 50 మంది ప్రయాణికులను, 42 మంది పారాట్రూపర్లను రవాణా చేయగలదు. ప్రకృతి విపత్తు సమయాల్లో మారుమూల ప్రాంతాలకు సామగ్రిని చేరవేసేందుకు ఈ విమానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు.
Also Read..
మహిళా పైలట్కు వేధింపులు.. జిమ్ మేనేజర్పై కేసు..
గడువు దాటిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్లను తిరస్కరిస్తే కుదరదు
బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఇదే సరైన సమయమా..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Plane Crashes | జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కుప్పకూలిన విమానం.. ఐదుగురు మృతి
జూన్ 13, 2026

Uniform Civil Code | అస్సాం అసెంబ్లీ ముందుకు ఉమ్మడి పౌర స్మృతి బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
మే 25, 2026

PM Modi | మెలోనీకి ప్రత్యేక కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jobs | ఉద్యోగం ఇచ్చేందుకు మనుషులను ఇంటర్వ్యూ చేస్తున్న ఏఐ.. ఇక నెగ్గడం అంత ఈజీ కాదు..
- ●Niranjan Reddy | రైతుబీమాను నిలిపేయడం కాంగ్రెస్ చారిత్రక ద్రోహం : నిరంజన్ రెడ్డి
- ●US-India | ట్రంప్-మోదీ భేటీ వేళ ఇండో పేరు తొలగించి.. భారత్కు షాకిచ్చిన అమెరికా
- ●Airtel | ఆర్మీతో చేతులు కలిపిన ఎయిర్టెల్.. అరుణాచల్ పర్వతాల్లోనూ ఇక నెట్వర్క్ ..
- ●Raghava Lawrence | డిప్యూటీ సీఎంగా రాఘవ లారెన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో
- ●Student Visa | విద్యార్థులారా.. విదేశీ స్టూడెంట్ వీసాకు ముందు ఇవి తప్పనిసరి..

Jobs | ఉద్యోగం ఇచ్చేందుకు మనుషులను ఇంటర్వ్యూ చేస్తున్న ఏఐ.. ఇక నెగ్గడం అంత ఈజీ కాదు..

Niranjan Reddy | రైతుబీమాను నిలిపేయడం కాంగ్రెస్ చారిత్రక ద్రోహం : నిరంజన్ రెడ్డి

US-India | ట్రంప్-మోదీ భేటీ వేళ ఇండో పేరు తొలగించి.. భారత్కు షాకిచ్చిన అమెరికా

Airtel | ఆర్మీతో చేతులు కలిపిన ఎయిర్టెల్.. అరుణాచల్ పర్వతాల్లోనూ ఇక నెట్వర్క్ ..



