త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | గుజ‌రాత్ జ‌ల‌దిగ్బంధం.. అస్సాంలో 47 మంది మృతి

Heavy Rains | భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో గుజ‌రాత్‌, అస్సాం రాష్ట్రాలు అత‌లాకుత‌ల‌మ‌య్యాయి (Heavy Rains). ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. అనేక న‌దులు, వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రెండు రాష్ట్రాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది.

D

National | Published On Jul 24, 2026, 2.10 pm IST

Heavy Rains | గుజ‌రాత్ జ‌ల‌దిగ్బంధం.. అస్సాంలో 47 మంది మృతి
Advertisement

Heavy Rains | గుజ‌రాత్‌లో వ‌ర్షం బీభ‌త్సం (Heavy Rains) సృష్టించింది. ఎడ‌తెరిపి లేకుండా కురిసిన వ‌ర్షానికి ప‌లు ప్రాంతాలు జ‌ల‌దిగ్భందంలో వెళ్లిపోయాయి. ముఖ్యంగా వ‌ల్సాద్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది. ఉంబెర్‌గావ్ తాలూకాలో కేవ‌లం 16 గంట‌ల్లోనే కురిసిన కుంభ‌వృష్టికి 1,100 మి.మీ రికార్డు స్థాయి వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

ప‌లు ప్రాంతాల్లో 600 మిల్లీ మీట‌ర్ల వ‌ర్షం కురిసింది. వంద‌లాది కార్లు, ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్ హెలికాప్ట‌ర్లు, ప‌డ‌వ‌ల సాయంతో 1,200 మందిని ర‌క్షించారు. సుమారు 20 వేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. సూర‌త్‌, న‌వ్‌సారీ, డాంగ్స్‌, తాపి, వ‌ల్సాద్ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది.


అస్సాంలో 47 మంది మృతి..

అటు అస్సాం రాష్ట్రం కూడా భారీ వ‌ర్షాల‌కు నీట మునిగింది. బ్ర‌హ్మ‌పుత్ర స‌హా ప‌లు న‌దులు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. మొత్తం 25 జిల్లాల్లోని 1,800కుపైగా గ్రామాలు నీట మునిగాయి. ఈ వ‌ర్షాల‌కు ప‌ది ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ప్ర‌భావిత‌మ‌య్యారు. ఈ వ‌ర్షాల కార‌ణంగా సంభ‌వించిన ప్ర‌మాదాల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement