Army chief | సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత తాత్కాలికమే.. ఆపరేషన్ సిందూర్ 2.0కు త్రివిధ దళాలు సిద్ధం : ఆర్మీ చీఫ్
Army chief | 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని భారత సైన్యాధిపతి (Army chief) జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత కేవలం తాత్కాలికమేనని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ 2.0కు (Operation Sindoor 2.0) త్రివిధ దళాలు (Tri-Services) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Army chief | భారత సైన్యాధిపతి (Army chief) జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత కేవలం తాత్కాలికమేనని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ 2.0కు (Operation Sindoor 2.0) సంబంధించి త్రివిధ దళాలు (Tri-Services) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. శత్రు దేశాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.
మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలోని (Khadakwasla) ఎన్డీఏలో జరిగిన 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. తాత్కాలికంగా ఘర్షణలు ఆగిపోయాయి. ఒకవేళ ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే దానికోసం దేశ త్రివిధ దళాలు పూర్తిగా సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం, మేము త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచుకోవడం, తదుపరి యుద్ధానికి సన్నద్ధం కావడంపై దృష్టి సారిస్తున్నాం" అని చెప్పారు. జాతీయ సంకల్పాన్ని కచ్చితత్వంతో, దృఢ నిశ్చయంతో ఎలా వ్యక్తపరచవచ్చో 'ఆపరేషన్ సిందూర్' ఒక ప్రమాణాన్ని నెలకొల్పిందని ఆర్మీ చీఫ్ తెలిపారు. రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఇచ్చే ప్రతిస్పందనను ఆపరేషన్ సిందూర్ నిర్వచించిందని అన్నారు.
ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు జనరల్ ద్వివేది ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో యుద్ధరంగంలోని ప్రతి కదలిక స్పష్టంగా కనిపించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అందుకే కేవలం సైనికుల భద్రత మాత్రమే కాకుండా పౌరుల రక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 24 గంటలూ రక్షణ దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయని వివరించారు. యుద్ధంలో విజయం సాధించాలంటే దేశ ప్రజల మద్దతు ఎంతో అవసరమని జనరల్ ద్వివేది పేర్కొన్నారు. ప్రజలు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. దేశమంతా ఒకే తాటిపైకి వచ్చినప్పుడే శత్రువుపై విజయం సాధ్యమవుతుందని వివరించారు.
Also Read..
ఉద్రిక్తతల మధ్యే హర్మూజ్ను దాటుతున్న భారత నౌకలు.. సీక్రెట్ను రివీల్ చేసిన కేంద్రం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

PM Modi | దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదు.. ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తైన వేళ ప్రధాని పోస్ట్
మే 7, 2026

China J-35AE Fighter Jet | డ్రాగన్ కొత్త మాస్టర్ ప్లాన్: పాకిస్థాన్ చేతికి చైనా ఫైటర్ జెట్స్!
మే 6, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



