త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Om Birla | ప్ర‌ధాని అయినా స‌రే ముందుగా నోటీసు ఇవ్వాల్సిందే.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడే హ‌క్కు ఎవ‌రికీ లేదు : ఓం బిర్లా

Om Birla | సభ‌లో తాను ప‌క్ష‌పాత ధోర‌ణి చూపించానంటూ ప్ర‌తిప‌క్షాలు చేసిన ఆరోప‌ణ‌ల‌ను లోక్‌స‌భ‌ స్పీక‌ర్ (Lok Sabha) ఓం బిర్లా (Om Birla) ఖండించారు. తాను త‌న విధుల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, న్యాయంగా నిర్వ‌హించేందుకే ప్ర‌య‌త్నించాన‌ని స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Mar 12, 2026, 1.59 pm IST

Om Birla | ప్ర‌ధాని అయినా స‌రే ముందుగా నోటీసు ఇవ్వాల్సిందే.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడే హ‌క్కు ఎవ‌రికీ లేదు : ఓం బిర్లా
Advertisement

Om Birla | సభ‌లో తాను ప‌క్ష‌పాత ధోర‌ణి చూపించానంటూ ప్ర‌తిప‌క్షాలు చేసిన ఆరోప‌ణ‌ల‌ను లోక్‌స‌భ‌ స్పీక‌ర్ (Lok Sabha) ఓం బిర్లా (Om Birla) ఖండించారు. తాను త‌న విధుల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, న్యాయంగా నిర్వ‌హించేందుకే ప్ర‌య‌త్నించాన‌ని స్ప‌ష్టం చేశారు. మంత్రైనా, ఎంపీ అయినా స‌భలో ప్ర‌తీ స‌భ్యుడికీ నిబంధ‌న‌ల ప్ర‌కారం మాట్లాడే హ‌క్కు ఉంద‌ని తెలిపారు. అందుకు అనుగుణంగానే అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు చెప్పారు. స‌భ‌లో అంద‌రూ స‌మాన‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఓం బిర్లా (Om Birla)పై ప్రతిపక్ష పార్టీలు ప్ర‌వేశ‌పెట్టిన‌ అవిశ్వాస తీర్మానం (no-confidence motion) వీగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌ళ్లీ త‌న స్థానాన్ని అధిష్టించారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశాలు ప్రారంభంకాగానే ఓం బిర్లా స్పీక‌ర్ స్థానంలో కూర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడారు. త‌న‌పై ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పందించారు.

ప్ర‌తీ ఒక్క‌రికీ మాట్లాడే హ‌క్కు ఉంది..

స‌భ‌లో ప్ర‌తిప‌క్ష ఎంపీల‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌డం లేదంటూ ఎంపీలు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఓం బిర్లా తిర‌స్క‌రించారు. "ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కొందరు సభ్యులు అన్నారు. సభలో మంత్రి అయినా ప్రతిపక్ష ఎంపీ అయినా.. నిబంధనల ప్రకారం మాట్లాడే హక్కు ప్రతి సభ్యునికీ ఉంటుంది. సభ సజావుగా సాగాలంటే నిబంధనలు త‌ప్ప‌కుండా పాటించాల్సిందే. ఈ సభలో నిబంధనలు సభ్యులందరికీ సమానంగా వర్తిస్తాయి" అని స్పీకర్ స్ప‌ష్టం చేశారు.

అయితే, ఏదైనా అంశంపై మాట్లాడే ముందు త‌ప్ప‌కుండా నోటీసు ఇవ్వాల‌ని స్పీక‌ర్ స్ప‌ష్టం చేశారు. "స‌భ‌లో ఎవ‌రూ నిబంధ‌న‌లకు అతీతులు కారు. ప్ర‌ధాన మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ఎంపీ అయినా స‌రే ఏదైనా అంశంపై మాట్లాడేముందు నోటీసు ఇవ్వాలి. ఆ త‌ర్వాతే మాట్లాడేందుకు వారికి అనుమ‌తి ఇస్తాం. ఈ స‌భ‌లో ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడే హ‌క్కు ఎవ‌రికీ లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

Also Read..

LPG shortage | లాక్‌డౌన్‌ను గుర్తు చేస్తున్న ఎల్పీజీ కొర‌త‌.. ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డుతున్న కార్మికులు

Farooq Abdullah | ఆ దేవుడే న‌న్ను ర‌క్షించాడు.. హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌పై ఫ‌రూఖ్ అబ్దుల్లా

ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. యుద్ధం ముగింపున‌కు మూడు ష‌ర‌తులు

Advertisement
Advertisement