Food Body Officer | గడువు తీరిన బిస్కెట్లు తినాలంటూ.. ఫుడ్ సేఫ్టీ అధికారికి చుక్కలు చూపించిన జనం
Food Body Officer | మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా విజయపూర్ పట్టణంలో ఓ ఫుడ్ సేఫ్టీ అధికారికి (Food Body Officer) స్థానికులు చుక్కలు చూపించారు. గడువు తీరిన బిస్కెట్లు (Expired biscuit packets) తినాలంటూ బలవంతం చేశారు.
త్రినేత్ర.న్యూస్ : తనిఖీల కోసం వెళ్లిన ఓ ఫుడ్ సేఫ్టీ అధికారికి (Food Body Officer) చేదు అనుభవం ఎదురైంది. సదరు అధికారి లంచం తీసుకుని గడువు తీరిన తినుబండారాలు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడికి సహకరిస్తున్నాడని ఆరోపిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. గడువు తీరిన బిస్కెట్లను (Expired biscuit packets) మీరే తినండి అంటూ ఆ అధికారికి జనం చుక్కలు చూపించారు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra ) ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhajinagar) జిల్లా విజయపూర్ పట్టణంలో చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? స్థానికంగా ఉన్న ఓ పాన్ షాపులో కొనుగోలు చేసిన మిక్చర్ తిని రెండేళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చిన్నారి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యలతోపాటూ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారు ఛత్రపతి సంభాజీనగర్లోని FDA కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో ఎఫ్డీఏ అధికారి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దుకాణంలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గడువు తీరిన కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయి. అయితే, తనిఖీలకు ముందే చిన్నారి అస్వస్థతకు కారణమైన స్నాక్ ప్యాకెట్లను దుకాణదారుడు మాయం చేశాడని స్థానికులు ఆరోపించారు. అంతేకాదు ఎక్స్పైరీ అయిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న అధికారి.. సదరు దుకాణదారుడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. లంచం తీసుకొని దుకాణదారుడికి ఎఫ్డీఏ అధికారి సహకరిస్తున్నారంటూ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో తనిఖీల కోసం వెళ్లిన అధికారిని స్థానికులు చుట్టుముట్టారు. గడువు తీరిన బిస్కెట్లను మీరే తినండి అంటూ బలవంతం చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా ఉల్లంఘనలపై మహారాష్ట్ర ఎఫ్డీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది.
CHHATRAPATI SAMBHAJINAGAR — An FDA officer was cornered and forcibly fed expired biscuits by an angry crowd in the Vaijapur area of Maharashtra. pic.twitter.com/Pq5rUfBenO
— Truth India Live (@Truthindialive) August 29, 2026
Also Read..
ఫుడ్ ప్యాకెట్లపై "రెడ్" వార్నింగ్.. సుప్రీంకోర్టుకు FSSAI కీలక ప్రతిపాదన
పుజల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు
స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tummidihatti Barrage | తుమ్మిడిహట్టి బ్యారేజ్పై సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశం
ఆగస్టు 27, 2026

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
ఆగస్టు 24, 2026

Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్పై బహిష్కరణ వేటు.. అసదుద్దీన్ నోరు విప్పాలి: సల్మాన్ ఖాన్
- ●SBI Life Smart Scholar Plus | ఐదేళ్లు చెల్లిస్తే రూ.45 లక్షలు.. పిల్లల భవిష్యత్తుకు ఎస్బీఐ పథకం..
- ●Nagarjuna | లూజర్ నుంచి కింగ్ - నాగార్జున వందో మూవీ గ్లింప్స్ రిలీజ్ - క్రిస్మస్కు థియేటర్లలోకి
- ●Assam Doctor | జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డాక్టర్..
- ●ఒకే నాణేనికి మూడు ముఖాలు: ఉగ్ర-తీవ్ర-వేర్పాటువాదాల అంతరార్థంపై ప్రత్యేక కథనం!
- ●Mobile GST Reduction | స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..

MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్పై బహిష్కరణ వేటు.. అసదుద్దీన్ నోరు విప్పాలి: సల్మాన్ ఖాన్

SBI Life Smart Scholar Plus | ఐదేళ్లు చెల్లిస్తే రూ.45 లక్షలు.. పిల్లల భవిష్యత్తుకు ఎస్బీఐ పథకం..

Nagarjuna | లూజర్ నుంచి కింగ్ - నాగార్జున వందో మూవీ గ్లింప్స్ రిలీజ్ - క్రిస్మస్కు థియేటర్లలోకి

Assam Doctor | జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డాక్టర్..



