Merger Talks | కాంగ్రెస్లో విలీనం కానున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. తుది దశకు చర్చలు!
Merger Talks | తిరుగుబాట్లు, చీలికలతో మహారాష్ట్రలో (Maharashtra) విపక్ష పార్టీలు రోజురోజుకు బలహీనమవుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు ఇప్పటికే షిండే సేనలో చేరిపోయారు. ఇప్పటికే చీలిపోయిన శివసేవన ఈ కుదుపుతో మరింత బలహీనమయింది.
Merger Talks | త్రినేత్ర.న్యూస్: తిరుగుబాట్లు, చీలికలతో మహారాష్ట్రలో (Maharashtra) విపక్ష పార్టీలు రోజురోజుకు బలహీనమవుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు ఇప్పటికే షిండే సేనలో చేరిపోయారు. ఇప్పటికే చీలిపోయిన శివసేవన ఈ కుదుపుతో మరింత బలహీనమయింది. విపక్ష కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీ (NCP) రెండు వర్గాలు చీలిపోయిన విషయం తెలిసింది. అజిత్పవార్ వర్గం అధికార ఎన్డీఏ కూటమిలో చేరగా, శదర్ పవార్ NCP (SP) విపక్షంగా ఉన్నది. ఈక్రమంలో ప్రతిపక్ష శిబిరంలో అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో, ఎన్సీపీ (ఎస్పీ).. కాంగ్రెస్ పార్టీలో (Congress) విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇరుపార్టీల అగ్రనేతలు ఇప్పటికే చర్చలు (Merger Talks) ప్రారంభించారు. చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, అవి తుది దశకు చేరినస్టు సమాచారం. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ హైకమాండ్, శరద్ పవార్ మధ్య విలీన చర్చలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెట్టివార్ ధృవీకరించారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. లౌకికవాద సిద్ధాంతాలను విశ్వసించే వారికి తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని చెప్పారు. దీనివల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని తెలిపారు.
మరోవైపు మహారాష్ట్ర స్థానిక నేతలు ఈ వార్తలను ఖండిస్తున్నారు. అయితే హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కాగా, విలీన చర్చల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకునే ముందు NCP (SP) నాయకత్వం అంతర్గతంగా ఏకాభిప్రాయాన్ని సాధించే పనిలో నిమగ్నమైం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఒక ప్రాథమిక అవగాహన కుదిరిన తర్వాత, ఢిల్లీలోని రెండు పార్టీల అగ్రనాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
గతంలోనూ చర్చలు..
ఈ రెండు పార్టీల మధ్య విలీన చర్చలు గతంలోనూ జరిగాయి. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ ప్రతిపాద వచ్చింది. అయితే, ఎన్నికల ప్రచారం కారణంగా చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ప్రతిపక్ష కూటమి 'మహా వికాస్ అఘాడి' (MVA) అంతర్గత సవాళ్లు, ఐక్యతకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటున్న తరుణంలో మరోసారి ఈ పరిణామం చోటుచేసుకుంది.

27 ఏండ్ల తర్వాత..
1999లో సోనియా గాంధీ విదేశీ మూలాల వివాదం నేపథ్యంలో కాంగ్రెస్తో విభేధించిన శరద్ పవార్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని (NCP) స్థాపించారు. 27 ఏళ్ల తర్వాత, ఇప్పుడు మళ్లీ విలీన చర్చలు జరుగుతున్నాయి. అయితే, 2023 అజిత్ పవార్ తిరుగుబాటు చేసి NCPని చీల్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. ఈ చీలిక కారణంగా, పార్టీ వారసత్వం, రాజకీయ గుర్తింపు తమకే చెందుతుందని ఇరు వర్గాలు వాదించుకున్నాయి. దీంతో ఎన్నికల సంఘం అజిత్ వర్గానికి పార్టీ గుర్తయిన గడియారాన్ని కేటాయించింది. కాగా, ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో.. రెండు వర్గాలు మళ్లీ కలిసిపోతాయనే చర్చ జరిగింది.
అయితే అజిత్ పవార్ వర్గంతో విలీనం జరిగే అవకాశమే లేదని శరద్ పవార్ వర్గం స్పష్టం చేసింది. కాగా, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండటం, శరద్ పవార్ వయస్సు (85 ఏళ్లు) రీత్యా పార్టీ భవిష్యత్తును సురక్షితం చేసేందుకు మళ్లీ మాతృసంస్థ అయిన కాంగ్రెస్లో విలీనం చేయడమే సరైన మార్గమని శరద్ పవార్ వర్గంలోని మెజారిటీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నారు. దీనిపై శరద్ పవార్ లేదా కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
సంబంధిత వార్తలు

Babli Project | బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత..
జులై 1, 2026

Rajnath Singh | సింధూర్లో సైనికులెవరూ అమరులు కాలేదంటూ ప్రకటన.. రాజ్నాథ్పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
జూన్ 30, 2026

Ramchandar Rao | కాంగ్రెస్.. పీవీని ఎప్పుడూ గౌరవించలే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●India vs England | ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?
- ●Tollywood | గ్రాండ్గా డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి - హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి
- ●22 ఏళ్ల తర్వాత నాకౌట్ విజయం
- ●PM-CM Removal Bill | మళ్లీ తెరపైకి పీఎం-సీఎం తొలగింపు బిల్లు..?
- ●Hyderabad | ఈగల్ టీమ్ శ్రమ వృథా.. 30 రోజులు గాలించి పట్టుకుంటే.. తెల్లారేసరికి నిందితుడు పరార్
- ●Bank of India Recruitment | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు.. 779 ఖాళీలతో నోటిఫికేషన్

India vs England | ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?

Tollywood | గ్రాండ్గా డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి - హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి

22 ఏళ్ల తర్వాత నాకౌట్ విజయం

PM-CM Removal Bill | మళ్లీ తెరపైకి పీఎం-సీఎం తొలగింపు బిల్లు..?



