త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

toxic liquor | క‌ల్తీ మ‌ద్యం తాగి 15 మంది మృతి.. ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

toxic liquor | మ‌హారాష్ట్ర‌లో కల్తీ మ‌ద్యం (toxic liquor) క‌ల‌క‌లం రేపింది. పూణె (Pune) శివారు ప్రాంతాల్లో క‌ల్తీ మ‌ద్యం సేవించి సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On May 29, 2026, 3.22 pm IST

toxic liquor | క‌ల్తీ మ‌ద్యం తాగి 15 మంది మృతి.. ప‌లువురి ప‌రిస్థితి విష‌మం
Advertisement

toxic liquor | మ‌హారాష్ట్ర‌లో కల్తీ మ‌ద్యం (toxic liquor) క‌ల‌క‌లం రేపింది. పూణె (Pune) శివారు ప్రాంతాల్లో క‌ల్తీ మ‌ద్యం సేవించి సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు. పింప్రి చించ్వాడ్ (Pimpri-Chinchwad)లోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల నుంచే ఎనిమిది మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. పూణెలోని కాలేప‌డ‌ల్ ప్రాంతంలో ముగ్గురు, హ‌డ‌ప్స‌ర్ (Hadapsar) ప్రాంతంలో న‌లుగురు మ‌ర‌ణించారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ న‌కిలీ మ‌ద్యం ఘ‌ట‌న‌పై మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ విచారం వ్య‌క్తం చేశారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇక ఈ కల్తీ మ‌ద్యం ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క‌ల్తీ మ‌ద్యాన్ని యోగేష్ వాంఖ‌డే అనే వ్య‌క్తి త‌యారు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డికి అక్ర‌మ మ‌ద్యం వ్యాపారంతో సంబంధం ఉంద‌ని, గ‌తంలో ఇత‌నిపై ప‌లు కేసులు కూడా న‌మోదైన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ క‌ల్తీ మ‌ద్యం వ్య‌వ‌హారం వెనుక ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నార‌న్న దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు.

Also Read..

ఈసారి సాధార‌ణం కంటే త‌క్కువే వ‌ర్షాలు.. జూన్‌లో అధిక ఉష్ణోగ్ర‌త‌లు : ఐఎండీ

రిజ‌ర్వ్ చేసిన మూడు నెల‌ల్లోనే తుది తీర్పు వెల్లడించాలి: హైకోర్టులకు సుప్రీం కీల‌క ఆదేశాలు

నాలుగు వంద‌ల కోట్లు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల్సిందే - మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ హైకోర్టులో కేసు

Advertisement
Advertisement