Maoist Party | మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ
Maoist Party | మావోయిస్టు పార్టీ (Maoist Party) కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీఎల్జీఏ) (PLGA) చీఫ్, కేంద్ర కమిటీ సభ్యుడు బర్సే దేవా (Badse Deva) అలియాస్ సుక్కతో సహా 20 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో సహా తెలంగాణ (Telangana) డీజీపీ (DGP) శివధర్రెడ్డి (Shivadhar Reddy) ఎదుట లొంగిపోయారు.
Maoist Party | మావోయిస్టు పార్టీ (Maoist Party) కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (పీఎల్జీఏ) (PLGA) చీఫ్, కేంద్ర కమిటీ సభ్యుడు బర్సే దేవా (Badse Deva) అలియాస్ సుక్కతో సహా 20 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో సహా తెలంగాణ (Telangana) డీజీపీ (DGP) శివధర్రెడ్డి (Shivadhar Reddy) ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ (Operation Kagar) ప్రారంభమైన తరువాత తెలంగాణలో జరిగిన అతి పెద్ద లొంగుబాటు ఇదే కావడం విశేషం. లొంగిపోయిన వారిలో పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి, ఆయన సతీమణి అడ్లూరి ఈశ్వరి అలియాస్ రేమతో పాటు పీఎల్జీఏ మొదటి బెటాలియన్ నుంచి పది మంది, టీఎస్సీ నుంచి ముగ్గురు, ఎస్ఎస్జెడ్బీ నుంచి ఇద్దరు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నుంచి అయిదు మంది ఉన్నారు. వారి నుంచి 48 మౌంటెడ్ ఎంఎల్జీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బార్సె దేవాపై రూ.యాభై లక్షల రివార్డు ఉంది. పార్టీకి ఆయుధాలు సమకూర్చడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయన లొంగుబాటుతో కేంద్రకమిటీలో ఇక నలుగురే మిగిలినట్లైంది.
బార్సె దేవా తన వద్ద ఉన్న రూ.ఇరవై లక్షలకు ఎస్ఐబీకి అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులను డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పీఎల్జీఏ పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. పీఎల్జీఏ బెటాలియన్లో ఒకప్పుడు 400 మందికి పైగా ఉండేవారని, ప్రస్తుతం 66 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. కంకణాల రాజిరెడ్డి లొంగుబాటుతో తెలంగాణ రాష్ట్ర కమిటీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఒక్కరు మాత్రమే మిగిలారన్నారు. లొంగిపోయినవారు ఇచ్చిన సమాచారంతో మావోయిస్టులలో ప్రస్తుతం రాష్ట్రం నుంచి కేవలం 17 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాలు అధికమయ్యాయని చెప్పారు. దానికి తోడు ఆరోగ్య సమస్యలతో వారు లొంగిపోయారన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



