త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India | ఇరాన్‌పై దాడులు.. వెన‌క్కి తిరిగొచ్చిన ఢిల్లీ-టెల్ అవీవ్‌ ఎయిర్ ఇండియా ఫ్లైట్‌

Air India | అమెరికా స‌హ‌కారంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప‌ట్ట‌ప‌గ‌లే భీక‌ర దాడులు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇజ్రాయెల్‌, ఇరాన్ దేశాలు త‌మ గ‌గ‌న‌త‌లాన్ని మూసివేశాయి (shuts airspace).

D

National | Published On Feb 28, 2026, 3.35 pm IST

Air India | ఇరాన్‌పై దాడులు.. వెన‌క్కి తిరిగొచ్చిన ఢిల్లీ-టెల్ అవీవ్‌ ఎయిర్ ఇండియా ఫ్లైట్‌
Advertisement

Air India | అమెరికా స‌హ‌కారంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప‌ట్ట‌ప‌గ‌లే భీక‌ర దాడులు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. రాజ‌ధాని టెహ్రాన్‌లోని ప‌లు ప్రాంతాల‌పై క్షిప‌ణులు, డ్రోన్ల‌తో విరుచుకుప‌డింది. దీంతో టెహ్రాన్‌లో భారీగా పొగ‌లు ఎగ‌సిప‌డ్డాయి. ఇక ఈ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇజ్రాయెల్‌, ఇరాన్ దేశాలు త‌మ గ‌గ‌న‌త‌లాన్ని మూసివేశాయి (shuts airspace). దీంతో భార‌త్ నుంచి ప‌శ్చిమాసియా వెళ్లే విమానరాక‌పోక‌ల‌కు తీవ్ర అంతరాయం ఏర్ప‌డింది.

తాజాగా ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం మార్గం మ‌ధ్య‌లో నుంచి వెన‌క్కి తిరిగి వ‌చ్చేసింది. ఎయిర్ ఇండియా (Air India)తోపాటూ ఇండిగో సైతం ప‌లు విమానాల‌ను ర‌ద్దు చేసింది. ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిస్థితుల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌యాణికులు, సిబ్బంది భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించింది.

మ‌రోవైపు ఈ దాడుల‌కు ఇరాన్‌సైతం ప్ర‌తీకార దాడుల‌కు దిగింది. ఇజ్రాయెల్‌, బెహ్‌రెయిన్‌, యూఏఈ, ఖ‌తార్‌, కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావ‌రాల‌పై క్షిప‌ణుల‌తో దాడుల‌కు దిగింది. ఈ దాడుల‌తో ప‌శ్చిమాసియాలో యుద్ధ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అని అంతా భ‌య‌ప‌డుతున్నారు. మ‌రోవైపు మూడో ప్రంచ యుద్ధం రాబోతోందంటూ కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప్ర‌పంచం మొత్తం నిశితంగా గ‌మ‌నిస్తోంది.

Also Read..

Donald Trump | ఆయుధాలు వీడ‌కుంటే మ‌ర‌ణ‌మే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చ‌రిక‌లు

India releases advisory for citizens | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. పౌరుల‌కు భార‌త్ కీల‌క అడ్వైజ‌రీ

మాన‌సిక ఆరోగ్యంలో భార‌త యువ‌త‌కు 60వ స్థానం.. వైద్య నిపుణుల హెచ్చ‌రిక‌..

Advertisement
Advertisement