త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru Metro | నిలిచిన మెట్రో రైళ్లు.. లారీలు, ట్ర‌క్కులు ఎక్కిన టెకీలు

Bengaluru Metro | నిత్యం ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణికుల‌తో ర‌ద్దీగా ఉండే బెంగ‌ళూరు మెట్రో (Bengaluru Metro) సేవ‌లు ఒక్క‌సారిగా నిలిచిపోయాయి. పీక్ అవర్స్‌లో ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వేలాది మంది టెకీలు స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. లారీలు, ట్ర‌క్కులు ఎక్కి గ‌మ్య‌స్థానాల‌కు చేరుకున్నారు.

D

National | Published On Jun 24, 2026, 1.53 pm IST

Bengaluru Metro | నిలిచిన మెట్రో రైళ్లు.. లారీలు, ట్ర‌క్కులు ఎక్కిన టెకీలు
Advertisement

Bengaluru Metro | నిత్యం ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణికుల‌తో ర‌ద్దీగా ఉండే బెంగ‌ళూరు మెట్రో (Bengaluru Metro) సేవ‌లు ఒక్క‌సారిగా నిలిచిపోయాయి. మంగ‌ళ‌వారం సాయంత్రం పీక్ అవ‌ర్స్‌లో ‘నమ్మ మెట్రో’ పర్పుల్ లైన్‌లో (Purple Line) సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో రైళ్లు ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయాయి. దీంతో ప‌ని ముగించుకుని ఇంటిబాట ప‌ట్టిన‌ వేలాది మంది న‌గ‌ర‌వాసులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు.

సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ (Cubbon Park Metro Station) వద్ద ఒక రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. వైట్‌ఫీల్డ్ ఐటీ కారిడార్‌ను నగరంలోని కీలక ప్రాంతాలతో అనుసంధానించే ఈ ప‌ర్సుల్‌ లైన్ నిలిచి పోవడంతో.. పీక్ అవర్స్‌లో ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వేలాది మంది టెకీలు స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. రైళ్లు నిలిచిపోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో వారంతా ఒక్క‌సారిగా రోడ్ల‌పైకి రావ‌డంతో గంద‌ర‌గోళం చోటు చేసుకుంది. బ‌స్సులు కిక్కిరిసి ఉండ‌టంతో చాలా మంది క్యాబ్‌లు బుక్ చేసుకుని వెళ్లారు. మరికొంద‌రు లారీలు, ట్ర‌క్కులు ఎక్కి గ‌మ్య‌స్థానాల‌కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై స్థానిక ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Also Read..

భోజ్‌పూర్‌లో యువకుడి ఎన్‌కౌంటర్‌పై విమ‌ర్శ‌లు.. పోలీసుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

ఇరాన్‌కు ప్ర‌యాణాలు చేయొద్దు.. భార‌తీయుల‌కు ఎంబ‌సీ కీల‌క సూచ‌న‌

రేవంత్ రెడ్డి, హ‌రీశ్‌రావు అక్రమాల వ‌ల్లే రైతుల ఆత్మ‌హ‌త్య : గువ్వ‌ల బాల‌రాజు

Advertisement
Advertisement