త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Guvvala Balaraju | రేవంత్ రెడ్డి, హ‌రీశ్‌రావు అక్రమాల వ‌ల్లే రైతుల ఆత్మ‌హ‌త్య : గువ్వ‌ల బాల‌రాజు

Guvvala Balaraju | కుటుంబ పాలన, భూ దందాలు, ఇసుక మాఫియాతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావుల అక్రమాల వల్లే ఈరోజు రైతులు, సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Jun 24, 2026, 1.31 pm IST

Guvvala Balaraju | రేవంత్ రెడ్డి, హ‌రీశ్‌రావు అక్రమాల వ‌ల్లే రైతుల ఆత్మ‌హ‌త్య : గువ్వ‌ల బాల‌రాజు
Advertisement

Guvvala Balaraju | త్రినేత్ర‌.న్యూస్ : కుటుంబ పాలన, భూ దందాలు, ఇసుక మాఫియాతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావుల అక్రమాల వల్లే ఈరోజు రైతులు, సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది చనిపోతే కనీస బాధ్యత తీసుకోలేదు. కేవలం తమ ఉనికిని చాటుకోవడం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తూ సభలు పెడుతున్నారు తప్ప, ప్రజల దాహార్తిని తీర్చాలన్న చిత్తశుద్ధి వీరికి లేదు అని దుయ్య‌బ‌ట్టారు. గతంలో ఇరిగేషన్ శాఖను చూసుకున్న కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ అచ్చంపేటకు నీళ్లివ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు. కానీ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి, నిరుపయోగంగా ఉన్న కాలువల చుట్టూ తిరిగి కేఎల్ఐ ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందించానని గుర్తు చేశారు. ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు నిధులు కేటాయించి ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలని నా సొంత డబ్బులతో సమావేశాలు పెట్టి మరీ పోరాడాను. ప్రజల కోసం పని చేసేది ఎవరో, పదవుల కోసం ప్రజలను దోచుకునేది ఎవరో తెలంగాణ సమాజం గమనిస్తోంద‌ని గువ్వ‌ల బాల‌రాజు పేర్కొన్నారు.

Advertisement
Advertisement