త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bus Catches Fire | ట్యాంక‌ర్‌ను ఢీ కొట్ట‌డంతో బ‌స్సుకు మంట‌లు.. న‌లుగురు స‌జీవద‌హ‌నం

Bus Catches Fire | గుజ‌రాత్ (Gujarat)లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. సురేంద్ర‌న‌గ‌ర్ (Surendranagar) జిల్లాలో ఓ ట్యాంక‌ర్‌ను (tanker) స్లీప‌ర్ బ‌స్సు ఢీ కొట్టింది. దీంతో బ‌స్సుకు మంట‌లు అంటుకుని (Bus Catches Fire) న‌లుగురు ప్ర‌యాణికులు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు.

D

National | Published On May 14, 2026, 1.01 pm IST

Bus Catches Fire | ట్యాంక‌ర్‌ను ఢీ కొట్ట‌డంతో బ‌స్సుకు మంట‌లు.. న‌లుగురు స‌జీవద‌హ‌నం
Advertisement

Bus Catches Fire | గుజ‌రాత్ (Gujarat)లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. సురేంద్ర‌న‌గ‌ర్ (Surendranagar) జిల్లాలో ఓ ట్యాంక‌ర్‌ను (tanker) స్లీప‌ర్ బ‌స్సు ఢీ కొట్టింది. దీంతో బ‌స్సుకు మంట‌లు అంటుకుని (Bus Catches Fire) న‌లుగురు ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు. సంగాని గ్రామ స‌మీపంలోని చోటిలా-రాజ్‌కోట్ జాతీయ ర‌హ‌దారిపై గురువారం తెల్ల‌వారుజామున ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.ఎస్. భడోరియా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఈ ల‌గ్జ‌రీ బ‌స్సు 40 మంది ప్ర‌యాణికుల‌తో అహ్మ‌దాబాద్ నుంచి రాజ్‌కోట్‌కు వెళ్తోంది. అదే మార్గం గుండా వెళ్తున్న ఓ ట్యాంక‌ర్ వాహ‌నం టైరు పేల‌డంతో అదుపుత‌ప్పింది. దీంతో దాని వెనుకే వ‌స్తున్న బ‌స్సు ట్యాంక‌ర్‌ను బ‌లంగా ఢీక‌ట్టింది. ఆ త‌ర్వాత మంట‌లు వ్యాపించాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు రెండు వాహ‌నాల‌కు అంటుకున్నాయి. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికులు వెంట‌నే కింద‌కు దిగిపోయారు. త‌ప్పించుకునే క్ర‌మంలో న‌లుగురు ప్ర‌యాణికులు మంట‌ల్లో స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. సుమారు 10 మంది గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంట‌ల‌ను అదుపు చేశారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం రాజ్‌కోట్ సివిల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ట్యాంక‌ర్ వాహ‌నంలో ఏముంద‌నే విష‌యం మాత్రం ఇంకా తెలియ‌రాలేదు.

Also Read..

ఉద్యోగులు సొంత వాహ‌నాల‌ను వ‌దిలి.. మెట్రోలో ప్ర‌యాణించండి.. ఢిల్లీ ప్ర‌భుత్వం పొదుపుబాట‌

కేరళం ముఖ్య‌మంత్రిగా వీడీ స‌తీష‌న్‌

జిన్​పింగ్ స్నేహితుడిగా ఉండటం నాకు గ‌ర్వ‌కార‌ణం : ట్రంప్

Advertisement
Advertisement