త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Blast At Cracker Manufacturing Unit | బాణ‌సంచా ఫ్యాక్ట‌రీలో వ‌రుస పేలుళ్లు.. 11 మంది మృతి

Blast At Cracker Manufacturing Unit | ఉత్త‌రప్ర‌దేశ్‌లో (Uttar Pradesh) ఓ బాణ‌సంచా ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది కార్మికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Aug 31, 2026, 5.25 pm IST

Blast At Cracker Manufacturing Unit | బాణ‌సంచా ఫ్యాక్ట‌రీలో వ‌రుస పేలుళ్లు.. 11 మంది మృతి
Advertisement

Blast At Cracker Manufacturing Unit | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్త‌రప్ర‌దేశ్‌లో (Uttar Pradesh) ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. కౌశాంబి జిల్లాలోని ఓ బాణ‌సంచా ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది కార్మికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌ది మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ప్రయాగ్‌రాజ్-కౌశాంబి సరిహద్దులోని పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అనేక మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయిన‌ట్లు అనుమానిస్తున్నారు.

ప్ర‌మాద స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఫ్యాక్ట‌రీలో వ‌రుస పేలుళ్లు సంభ‌వించిన‌ట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి స‌మీపంలోని ప‌లు ఇళ్లు కూడా ధ్వంస‌మ‌య్యాయి. ప్ర‌మాద స‌మ‌యంలో అక్క‌డ చాలా మంది కార్మికులు కూడా ఉన్న‌ట్లు తెలిసింది. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

అస్సాం జైళ్ల‌లో హెచ్ఐవీ క‌ల‌క‌లం.. 4 నెల‌ల్లో 200 మందికి పాజిటివ్‌

వ‌ర‌ద జ‌లాలే ల‌క్ష్యంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం : మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైదరాబాద్‌లో జొమాటో ఉద్యోగులకు షాక్.. 250 మందిపై వేటు..?

Advertisement
Advertisement