త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AMRUT 2.0 Telangana | హైదరాబాద్ ఔటర్ చుట్టూ మురుగునీటికి చెక్.. రూ.1,906 కోట్లతో 22 భారీ STPలకు తెలంగాణ సర్కార్ ఓకే

హైదరాబాద్ (GHMC), ఔటర్ రింగ్ రోడ్ (ORR) మధ్య మురుగునీటి సమస్యకు చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,906 కోట్లతో 22 ప్లాంట్లకు ఓకే చెప్పింది.

J

Hyderabad | Published On Aug 31, 2026, 4.46 pm IST

AMRUT 2.0 Telangana | హైదరాబాద్ ఔటర్ చుట్టూ మురుగునీటికి చెక్.. రూ.1,906 కోట్లతో 22 భారీ STPలకు తెలంగాణ సర్కార్ ఓకే

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ మహా నగర పరిధిలో (GHMC - ORR మధ్య) కొత్తగా 22 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (STPs) నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమృత్ 2.0 (AMRUT 2.0 - TRANCHE-III) పథకం ప్యాకేజ్-II కింద రూ. 1,906.44 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ 22 ప్లాంట్లు ప్రతిరోజూ 471.50 MLD మురుగునీటిని శుద్ధి చేసే భారీ సామర్థ్యం కలిగి ఉంటాయి. ప్లాంట్ల నిర్మాణంతో పాటు రాబోయే 15 ఏళ్ల పాటు వాటి నిర్వహణ (Operation & Maintenance) బాధ్యతలను కాంట్రాక్ట్ సంస్థే చూసుకుంటుంది.

Advertisement

AMRUT 2.0 Telangana | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (MA&UD) శాఖ ద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ (GHMC), ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మధ్య ఉన్న ప్రాంతాల్లో పెరుగుతున్న మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అమృత్ 2.0 (AMRUT 2.0) పథకంలో భాగంగా 22 కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (Sewerage Treatment Plants - STPs) నిర్మాణానికి అధికారిక ఉత్తర్వులు (Orders) జారీ చేసింది.

భారీ సామర్థ్యం.. వేల కోట్ల బడ్జెట్

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ.1,906.44 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. ప్యాకేజ్-II కింద నిర్మించనున్న ఈ 22 ప్లాంట్లు రోజుకు 471.50 MLD (మిలియన్ లీటర్ల మురుగునీరు) ని శుద్ధి చేయగల భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గనుంది.

Telangana Govt Clears 22 New STPs in Hyderabad for Rs 1906 Cr Under AMRUT 2.0

15 ఏళ్ల పాటు పూర్తి బాధ్యత

ఈ మెగా ప్రాజెక్టును నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ (NCB) ద్వారా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) పద్ధతిలో వాటర్ బోర్డ్ (HMWSSB) అమలు చేయనుంది. ఈ పద్ధతి ప్రకారం.. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ కేవలం ప్లాంట్లను నిర్మించడమే కాకుండా, రాబోయే 15 ఏళ్ల పాటు వాటి పూర్తి నిర్వహణ (Management, Operation & Maintenance - MoM) బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది.

తాజాగా ప్రాజెక్టు కన్సెషన్ అగ్రిమెంట్ (Concession Agreement) లోని ఎస్క్రో అకౌంట్‌ (Escrow Account - తాత్కాలిక ఖాతా ) కు సంబంధించిన నిబంధనల్లో (క్లాజ్ 28) కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మార్పులను ధృవీకరిస్తూ, ప్రాజెక్టు పనుల ప్రారంభ తేదీని (Date of Appointment) నోటిఫై చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల రూపురేఖలు మారిపోవడమే కాకుండా, మూసీ ప్రక్షాళనకు కూడా పరోక్షంగా ఎంతో మేలు జరగనుంది.

Advertisement
Advertisement