త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttar Pradesh | యూపీలో తుఫాను బీభ‌త్సం.. ఒక్క‌రోజే 100 మంది మృతి

Uttar Pradesh | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో (Uttar Pradesh) తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. అకాల వ‌ర్షంతో రాష్ట్రం మొత్తం అత‌లాకుత‌ల‌మైంది. ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఒక్క‌రోజే 100 మంది మ‌ర‌ణించారు.

D

National | Published On May 14, 2026, 4.12 pm IST

Uttar Pradesh | యూపీలో తుఫాను బీభ‌త్సం.. ఒక్క‌రోజే 100 మంది మృతి
Advertisement

Uttar Pradesh | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో (Uttar Pradesh) తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. అకాల వ‌ర్షంతో రాష్ట్రం మొత్తం అత‌లాకుత‌ల‌మైంది. ఈదురు గాలులు, భారీ వ‌ర్షం విధ్వంసం సృష్టించింది. ఈ వ‌ర్ష‌బీభ‌త్సానికి నిన్న ఒక్క‌రోజే 100 మంది చ‌నిపోయారంటే.. ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఒక్క ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj)లో అత్య‌ధికంగా 21 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. భ‌దోహిలో 18 మంది, మీర్జాపూర్‌లో 15, ఫ‌తేపూర్‌లో 10, ఉన్నావ్ , బ‌దౌన్‌లో ఆరుగురు చొప్పున‌, ప్ర‌తాప్‌గ‌ఢ్‌, బ‌రేలీలో న‌లుగురు చొప్పున‌, సీతాపూర్‌, రాయ్‌బ‌రేలీ, చందౌలీలో ఇద్ద‌రు చొప్పున మ‌ర‌ణించారు. కాన్పూర్ దేహత్, హర్దోయ్, సంభాల్‌లో ఇద్ద‌రు చొప్పున‌, కౌశంబి, షాజహాన్‌పూర్, సోన్‌భద్ర, లఖింపూర్‌లలో ఒక్కొక్కరు చనిపోయారు.

వడగళ్ల వానతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. ఇండ్లు ధ్వంస‌మ‌య్యాయి. మృతుల్లో ఎక్కువ మంది పొలాల్లో పని చేస్తున్న వారు, వర్షం నుంచి తప్పించుకోవడానికి చెట్ల కింద ఆశ్రయం పొందిన వారే ఉన్నట్లు తెలుస్తున్న‌ది. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతోపాటు మొబైల్ నెట్‌వ‌ర్క్‌లు ప‌నిచేయ‌డం లేదు. మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంతో పునరుద్ధ‌ర‌ణ‌, స‌హాయ‌క చ‌ర్య‌లకు తీవ్ర ఆటంకం క‌లుగుతున్న‌ద‌ని కున్వ‌ర్ అద‌న‌పు క‌లెక్ట‌ర్ వీరేంద్ర కుమార్ మౌర్య చెప్పారు. జిల్లాలోని స్థానిక అధికారులు, పోలీసులు స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు.

Also Read..

మూడో ద‌శ స‌ర్‌పై ఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?

మ‌రోసారి లాయ‌ర్ అవ‌తార‌మెత్తిన మ‌మ‌తా బెన‌ర్జీ.. కేసు వాదించేందుకు న‌ల్ల‌కోటు ధ‌రించి కోర్టుకు వెళ్లిన దీదీ

కాన్వాయ్‌ను త‌గ్గించండి.. గ‌వ‌ర్న‌ర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశం

Advertisement
Advertisement