Mojtaba Khamenei | మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? యుద్ధంలో గాయపడిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..?
Mojtaba Khamenei | అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా నియమితులైన విషయం తెలిసిందే.
International | Published On Mar 11, 2026, 11.42 am IST
Mojtaba Khamenei | అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నియామకాన్ని ఇరాన్ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్' అధికారికంగా ప్రకటించింది. తదుపరి సుప్రీం లీడర్గా మొజ్తాబాను ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వచ్చి నాలుగు రోజులు అవుతున్నా.. ఆయన ఎక్కడా బయట కనిపించకపోవడం ప్రస్తుతం హాట్టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన తన మద్దతుదారుల ముందుకు రాకపోవడం, ఎలాంటి సందేశం విడుదల చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఆయన కార్యాలయం కూడా మొజ్తాబాకు సంబంధించి ఎలాంటి వివరాలనూ పంచుకోవడం లేదు. ప్రభుత్వ మీడియా మాత్రం ఆయన పాత ఫుటేజీలను ఉపయోగిస్తూ ఆయన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో బహుశా ఆయన గాయపడి ఉండొచ్చంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా కొత్త సుప్రీం లీడర్ను "జాన్బాజ్ ఆఫ్ రమదాన్" అంటూ పేర్కొంటోంది. అంటే రమదాన్ యుద్ధంలో గాయపడిన వీరుడు అని అర్థం. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుప్రీం లీడర్గా ఎన్నుకున్న తర్వాత ఎవరైనా సరే దేశ ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని విడుదల చేస్తుంటారు. లేదంటే రాతపూర్వకంగా అయినా ప్రకటన చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. దీంతో మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? అంటూ ఇరాన్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కటౌట్లతో ర్యాలీ..
సుప్రీం లీడర్గా ఎన్నికైన తర్వాత కూడా ఆయన బయటకు రాకపోవడం తీవ్ర చర్చనీయాశంమవుతోంది. ఇక తదుపరి సుప్రీం లీడర్గా ఎన్నికైన మొజ్తాబాకు మద్దతుగా ఆయన మద్దతుదారులు ఆ దేశంలో ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. టెహ్రాన్లో నిర్వహించిన సభకు ఆయన ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా హాజరుకాకపోవడంతో ఆయన మద్దతుదారులు కటౌట్ను తీసుకొచ్చిపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఎన్ఓపీవో రక్షణలో ముజ్తాబా ఖమేనీ..?
అయితే, తండ్రి హత్య తర్వాత కొత్త సుప్రీంలీడర్ను రక్షించుకునేందుకు ఇరాన్ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు అమెరికా మీడియా పేర్కొంటోంది. ఇరాన్ ప్రత్యేక ఉగ్రవాద వ్యతిరేకదళం ఎన్ఓపీవో ముజ్తాబాకు రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడిస్తోంది. ఇజ్రాయెల్-యూఎస్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఆయన ఉనికి బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నట్లు పేర్కొంటోంది. ఖమేనీ మరణానంతరం ముజ్తాబా ఖమేనీకి ఎన్ఓపీవో రక్షణ కల్పిస్తున్నట్లు పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ విదేశీ వ్యవహారాల కమిటీ ప్రతినిధి అలీ సఫావీ తెలిపినట్లు అమెరికా మీడియా నివేదిస్తోంది. ఎన్ఓపీవో ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన, రహస్యమైన భద్రతా దళం. అంతేకాదు, అత్యంత క్షిష్టమైన ఆపరేషన్లు చేపట్టే ఓ ప్రత్యేక విభాగం కూడా.
Also Read..
హర్మూజ్ సమీపంలో ఇరాన్ మైన్ లేయింగ్స్పై అమెరికా భీకర దాడులు
పొట్టను దాచుకోలేకపోతున్నా.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
13 ఏండ్లు కోమాలోనే.. అతనికి చనిపోయే హక్కు ఉందా?.. నేడు సుప్రీంకోర్టు తీర్పు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






