Harish Rana | 13 ఏండ్లు కోమాలోనే.. అతనికి చనిపోయే హక్కు ఉందా?.. నేడు సుప్రీంకోర్టు తీర్పు
Harish Rana | సుమారు 13 ఏండ్లుగా కోమాలో (Coma) ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల హరీశ్ రాణా (Harish Rana) కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించనుంది.
Harish Rana | త్రినేత్ర.న్యూస్: సుమారు 13 ఏండ్లుగా కోమాలో (Coma) ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల హరీశ్ రాణా (Harish Rana) కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించనుంది. తన కుమారుడికి కారుణ్య మరణం (Passive Euthanasia) ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం జనవరి 15న తీర్పును రిజర్వు చేసింది. ‘ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని మేం ఉపయోగించలేం. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం. మేమూ మనుషులమే. ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామని వెల్లడించిన సుప్రీంకోర్టు తీర్పును మాచ్చి 11కు వాయిదావేసింది.
ఎవరీ హరీశ్ రాణా..
ఢిల్లీకి చెందిన 32 ఏండ్ల హరీశ్ రాణా.. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో, 2013 ఆగస్టు 20న ప్రమాదవశాత్తు పీజీ హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ దవాఖాల్లో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి కోమాలోనే ఉండిపోయాడు.
ఇన్నేండ్లుగా అతని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి చూసుకుంటున్నారు. అయితే జీవచ్చవంలా పడిఉన్న తమ కుమారుడిని కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇదే విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో మళ్లీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లారు. మెడికల్ రిపోర్ట్లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జనవరి 15న తీర్పును రిజర్వ్ చేశారు. మార్చి 11న తుది తీర్పును వెళ్లడిస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Excise Scam Case | కోర్టు ధిక్కరణ కేసు.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు తాఖీదులు..
మే 19, 2026

Vinesh Phogat | వినేశ్ ఫొగాట్ పిటిషన్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
మే 18, 2026

Sunjay Kapur Property Dispute | కరిష్మా కపూర్ పిల్లలకు భారీ ఊరట.. రూ.30 వేల కోట్ల సంజయ్ కపూర్ ఆస్తులను ఫ్రీజ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



