త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..

Ayatollah Ali Khamenei | అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన దివంగ‌త ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల‌కు (Funeral) భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు అంతిమ‌యాత్ర కొన‌సాగ‌నుంది.

G

International | Published On Jul 3, 2026, 9.50 am IST

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
Advertisement

Ayatollah Ali Khamenei | త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన దివంగ‌త ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల‌కు (Funeral) భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు అంతిమ‌యాత్ర కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ఖమేనీ భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్‌కు (Tehran) తరలించారు. అక్కడి నుంచి ఫిబ్రవరి 28న ఆయన హత్యకు గురైన ప్రదేశానికి చేర్చారు. గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు (IRGC) చెందిన సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీది సహా టెహ్రాన్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితోపాటు న‌లుపురంగు దుస్తులు ధ‌రించిన ఖ‌మేనీ మ‌ద్ద‌తుదారులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. కాగా, టెహ్రాన్‌లో జూలై 4,5 తేదీల్లో జరగనున్న అంతిమయాత్రకు రికార్డు స్థాయిలో జ‌నం ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తార‌ని ఐఆర్‌జీసీ అంచనావేస్తున్న‌ది.

ఖ‌మేనీ అంతిమ‌యాత్ర ఇరాన్‌, ఇరాక్ మీదుగా ఐదు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ఈ నెల 9న ఖమేనీ (Ali Khamenei) స్వస్థలం మషాద్‌లో ఖననం చేయనున్నారు. కాగా, తండ్రి అత్యక్రియల‌కు సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) దూరంగా ఉండ‌నున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో మొజ్తబా ఖమేనీ పాల్గొనబోరని భారత్‌లో ఆ దేశ ప్రతినిధి అయతుల్లా హకీం ఇలాహి వెల్ల‌డించారు. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా భద్రతా పరంగా తీవ్ర సమస్యలు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆయ‌న బ‌య‌ట‌కు రావాల‌ని, ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల‌ని కోరుకుంటున్నార‌ని పేర్కొన్నారు. కానీ భ‌ద్ర‌తా సిబ్బంది అందుకు అనుమ‌తించ‌డం లేద‌న్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఖ‌మేనీ అంత్య‌క్రియ‌లు జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభం కానున్నాయి. అనంత‌రం ఈ నెల 7న ఖోమ్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. చివ‌ర‌గా జూలై 9న ఆయ‌న స్వ‌స్థ‌లం మ‌ప్హ‌ద్‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి ఖ‌న‌నం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఖ‌మేనీకి అంతిమ వీడ్కోలు ప‌లికేందుకు ప్ర‌పంచం న‌లుమూలల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్ర‌ములు టెహ్రాన్‌కు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇరాన్‌ నుంచి భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. అయితే కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్‌ గవర్నర్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌ హాజరుకానున్నట్లు తెలుస్తున్న‌ది. అదేవిధంగా ఏఐసీసీ అధ్య‌క్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నాయకులు సాల్మన్ ఖుర్షీద్, పవన్ ఖెరాలను కూడా ఇరాన్ ఆహ్వానించింది.

Advertisement
Advertisement