US Aircraft Crash | అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. ఇరాక్లో కుప్పకూలిన సైనిక విమానం
US Aircraft Crash | ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ (US Aircraft Crash) తగిలింది. యూఎస్ ఎయిర్ఫోర్సుకు చెందిన ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలింది.
International | Published On Mar 13, 2026, 9.02 am IST
US Aircraft Crash | త్రినేత్ర.న్యూస్: ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో ఎదురుదెబ్బ (US Aircraft Crash) తగిలింది. యూఎస్ ఎయిర్ఫోర్సుకు చెందిన ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలింది. పశ్చిమ ఇరాక్లో (Iraq) ఈ ఘటన చోటుచేసుకుందని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది. ఇరాన్తో యుద్ధం ప్రారంభించిన తర్వాత పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన విమానాలు కూలిపోవడం (Aircraft Crash) ఇది నాలుగోసారి. అయితే ఈ విమానం ఎవరి దాడుల్లోనూ కూలిపోలేదని యూఎస్ ఆర్మీ స్పష్టం చేసింది.
అసలేమైందంటే..
సైనిక చర్యల్లో భాగంగా రెండు కేసీ-135 ఇంధన ట్యాంకర్ విమానాలు గాలిలోకి ఎగిరాయి. వాటిలో ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. రెండో విమానం సాంకేతిక కారణాల వల్ల పశ్చిమ ఇరాక్లో కుప్పకూలింది. అయితే, ఈ విమానం శత్రువుల కాల్పుల వల్ల కూలిపోలేదని పశ్చిమాసియాలో అమెరిక బలగాలకు బాధ్యతవహిస్తున్న యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంది.
అయితే ఈ విమానాన్ని తామే కూల్చామని ఇరాక్లో ఇరాన్ మద్దతున్న రెసిస్టెన్స్ గ్రూప్ (Iraq's Resistance Groups) ప్రకటించింది. పశ్చిమ ఇరాక్లో అమెరికా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ని క్షిపణితో కూల్చివేశామని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ వార్తలను అమెరికా కొట్టివేసింది. అది ప్రమాదవశాత్తు కూలిపోయిందని చెప్పింది.
కేసీ-135 విమానం గత 60 ఏండ్లుగా సేవలు అందిస్తున్నది. సాధారణంగా అందులో ముగ్గురు సిబ్బంది ఉంటరు. ఇద్దరు పైలట్లు, మరొకరు మరో విమానానికి ఇంధనం నింపేందుకు ఉపయోగించే పరికరాలను నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని కే-135 విమానాల్లో ఒక న్యావిగేటర్తోపాటు 37 మంది వరకు ప్రయాణించవచ్చని ఎయిర్ ఫోర్స్ ఫ్యాక్ట్షీట్ వెల్లడించింది.
నాలుగో విమానం..
ఇక, ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఇప్పటికే మూడు విమానాలను కోల్పోయింది. మూడు ఎఫ్-15ఈ యుద్ధవిమానాలు కువైట్ సైన్యం పొరపాటున జరిపిన కాల్పుల్లో కూలిపోయాయి. తాజాగా మరొకటి కూలిపోవడం గమనార్హం.
https://x.com/CENTCOM/status/2032115048340988255
ఇవికూడా చదవండి..
వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..
నేను కృష్ణ అభిమానిని.. లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి సినిమాలు చూసేవాడిని : రేవంత్ రెడ్డి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Indian Embassy in Tehran | ఇరాన్కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన
జూన్ 24, 2026

Hormuz Crisis | హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. అమెరికాపై ఘాటు విమర్శలు
జూన్ 23, 2026

FIFA 2026 | ఇరాన్ ఫుట్బాల్ టీమ్ ట్రావెల్పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా
జూన్ 21, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



