త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pak Claims India preparing for another war | భార‌త్ మ‌రో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతోంది.. పాక్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Pak Claims India preparing for another war | భార‌త్‌ (India)పై పాకిస్థాన్ (Pakistan) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌మ దేశంపై న్యూ ఢిల్లీ మ‌రో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు (Pakistan President) ఆసిఫ్ అలీ జ‌ర్దారీ (Asif Ali Zardari) ఆరోపించారు.

D

International | Published On Mar 3, 2026, 1.16 pm IST

Pak Claims India preparing for another war | భార‌త్ మ‌రో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతోంది.. పాక్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
Advertisement

Pak Claims India preparing for another war | భార‌త్‌ (India)పై పాకిస్థాన్ (Pakistan) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌మ దేశంపై న్యూ ఢిల్లీ మ‌రో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు (Pakistan President) ఆసిఫ్ అలీ జ‌ర్దారీ (Asif Ali Zardari) ఆరోపించారు. యుద్ధ ఆలోచ‌నలు వ‌దిలి.. త‌మ‌తో చ‌ర్చ‌ల‌కు రావాల‌ని కోరారు. "భారత నాయకులు తాము మరో యుద్ధానికి సిద్ధమవుతున్నామని చెబుతున్నారు. ప్రాంతీయ శాంతిని కోరుకునే వ్యక్తిగా.. అలాంటి వాటిని నేను స‌మ‌ర్థించ‌ను. నేను వారికి చెప్పేది ఒక్క‌టే.. యుద్ధ ఆలోచ‌న‌ల‌ను వ‌దిలేసి మాతో చ‌ర్చ‌ల‌కు రావాలి" అని పేర్కొన్నారు. ఆ దేశ పార్ల‌మెంట్ సంయుక్త స‌మావేశంలో ప్ర‌సంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఇక ఈ సంద‌ర్భంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేయాల‌న్న భార‌త్ నిర్ణ‌యాన్ని జ‌ర్దారీ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇలా చేయ‌డాన్ని జ‌ల టెర్ర‌రిజంగా అభివర్ణించారు. అంతేకాదు, రాజకీయ ప్రయోజనాల కోసం నీటి ప్రవాహాలను భార‌త్‌ ఆయుధంగా వాడుకుంటోంద‌ని ఆరోపించారు. అదేవిధంగా జ‌మ్ము క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా జ‌ర్దారీ వెల్ల‌డించారు. క‌శ్మీర్‌లోని ప్ర‌జ‌ల‌కు పాక్ త‌న దౌత్య‌ప‌ర‌మైన‌, నైతిక మ‌ద్ద‌తును కొన‌సాగిస్తుంద‌ని పున‌రుద్ఘాటించారు. క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కూ ద‌క్షిణాసియాలో శాశ్వ‌త శాంతి అనేది అసాధ్య‌మ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

Also Read..

సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాని మోదీ మ‌రో రికార్డు

ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్‌వ‌ర్క్‌.. ఖ‌మేనీ క‌ద‌లిక‌ల‌ను ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసిందంటే..?

ఖ‌మేనీ హ‌త్య‌పై మౌనం ఎందుకు..? ఇదేనా మీ విదేశాంగ విధానం..? కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ

Advertisement
Advertisement