త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khawaja Asif | అదే జ‌రిగితే భార‌త్‌తో యుద్ధ‌మే.. పాక్ ర‌క్ష‌ణ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Khawaja Asif | పాకిస్థాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ (Khawaja Asif) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ తీసుకునే చ‌ర్య‌లు త‌మ దేశ నీటి భ‌ద్ర‌త‌కు (Pakistan water security) ముప్పు క‌లిగిస్తాయ‌ని భావిస్తే ఇస్లామాబాద్ సైనిక చర్యకు దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు.

D

International | Published On Jun 22, 2026, 11.29 am IST

Khawaja Asif | అదే జ‌రిగితే భార‌త్‌తో యుద్ధ‌మే.. పాక్ ర‌క్ష‌ణ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Khawaja Asif | దాయాది పాకిస్థాన్ మ‌రోసారి క‌వ్వింపుల‌కు దిగింది. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత‌ సింధు న‌దీ జ‌లాల వ్య‌వ‌హారంలో ( Indus Waters Treaty) ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న వేళ ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ (Khawaja Asif) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ తీసుకునే చ‌ర్య‌లు త‌మ దేశ నీటి భ‌ద్ర‌త‌కు (Pakistan water security) ముప్పు క‌లిగిస్తాయ‌ని భావిస్తే ఇస్లామాబాద్ సైనిక చర్యకు దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు.

ఓ మీడియాతో ఆసిఫ్ మాట్లాడుతూ.. నీరు అనేది త‌మ‌కు అత్యంత కీల‌క‌మైన జాతీయ భ‌ద్ర‌తా అంశ‌మ‌ని తెలిపారు. భార‌త్ చ‌ర్య‌ల‌తో సింధు న‌దీ ప‌రివాహ‌క ప్రాంత జ‌లాల ల‌భ్య‌త‌కు తీవ్ర ముప్పు వాటిల్లుతోంద‌ని భావిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. "నీరు కూడా మా జాతీయ భద్రతలో భాగమే. ముప్పు పొంచి ఉందని భావించిన మరుక్షణమే.. మేము భారతదేశంపై యుద్ధానికి వెళ్తాము. ఇది ఖాయం" అని ఆయన అన్నారు. కాగా, 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్థాన్‌కు పూర్తిగా నిలిపివేయవచ్చని భారత జలశక్తి మంత్రి సీఆర్​ పటిల్ (CR Patil) వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆ తర్వాత అసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, గ‌తేడాది ఏప్రిల్‌లో ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్థాన్‌పై భార‌త్ ప‌లు ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాకిస్థాన్ ప్రోత్సహిత సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించే వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ ఉండదని భారత్ స్పష్టం చేసింది. భార‌త్ నిర్ణ‌యంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Also Read..

ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?.. డీటీవో వెంక‌న్న మృతిపై హ‌రీశ్ రావు ఆగ్ర‌హం

ఖ‌తార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గ‌ల్లంతు

వాహ‌నాలు త‌నిఖీ చేస్తుండ‌గా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..

Advertisement
Advertisement