త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran-US review ceasefire plan | కాల్పుల విర‌మ‌ణ ప్రణాళికను స‌మీక్షిస్తున్న‌ అమెరికా-ఇరాన్.. యుద్ధం ముగిసేనా..?

Iran-US review ceasefire plan | ప‌శ్చిమాసియా సంక్షోభాన్ని(Iran War) ఆపేందుకు ఈజిప్ట్‌, పాకిస్థాన్‌, తుర్కియే దేశాలు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశాయి. ఇందులో భాగంగా మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం ముగింపు ప‌లికే ల‌క్ష్యంతో ఓ కీల‌క ప్ర‌తిపాద‌న‌ను తెచ్చాయి.

D

International | Published On Apr 6, 2026, 4.09 pm IST

Iran-US review ceasefire plan | కాల్పుల విర‌మ‌ణ ప్రణాళికను స‌మీక్షిస్తున్న‌ అమెరికా-ఇరాన్.. యుద్ధం ముగిసేనా..?
Advertisement

Iran-US review ceasefire plan | ప‌శ్చిమాసియా సంక్షోభాన్ని(Iran War) ఆపేందుకు ఈజిప్ట్‌, పాకిస్థాన్‌, తుర్కియే దేశాలు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశాయి. ఇందులో భాగంగా మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం ముగింపు ప‌లికే ల‌క్ష్యంతో ఓ కీల‌క ప్ర‌తిపాద‌న‌ను తెచ్చాయి. ఈ ముసాయిదా ప్లాన్‌ను అమెరికా, ఇరాన్‌కు అందించిన‌ట్లు సంబంధిత‌ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ రాయిట‌ర్స్ వార్తా సంస్థ నివేదించింది.

ఈ ప్ర‌తిపాద‌న‌లో 45 రోజుల‌పాటూ త‌క్ష‌ణ కాల్పుల విర‌మ‌ణ‌, హ‌ర్మూజ్‌ను తెర‌వ‌డం వంటి ముఖ్య‌మైన అంశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ప్రణాళికను రెండు దేశాలూ ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌ద‌రు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ సీజ్‌ఫైర్ ప్లాన్‌పై చ‌ర్చించేందుకు అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర‌గాచి, ప‌శ్చిమాసియా దౌత్య‌వేత్త స్టీవ్ విట్‌కాఫ్‌తో పాకిస్థాన్ సైన్యాధిప‌తి అసిమ్ మునీర్ రాత్రంతా నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు రాయిట‌ర్స్ నివేదించింది.

ప్రస్తుత సంక్షోభాన్ని తాత్కాలికంగా ముగించి, చర్చలకు మార్గం సుగమం చేయడమే ఈ సీజ్‌ఫైర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. అమెరికా, ఇరాన్‌లు పరస్పర దాడులు చేసుకోకుండా 45 రోజుల పాటు సంమయనం పాటించాలి. ఈ గడువులోగా ఇరు దేశాల ప్రతినిధులు వివాదాస్పద అంశాలపై ముఖాముఖి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంటుంది. అయితే తాత్కాలిక కాల్పుల విర‌మ‌ణ‌కు ఇరాన్‌, అమెరికా అంగీకరిస్తాయా..? లేదా..? అన్న అంశంపై క్లారిటీ లేదు. ఈ ప్ర‌తిపాద‌న‌పై ఇరు దేశాలూ సానుకూలంగా స్పందించే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే నెల‌రోజుల‌కుపైగా సాగుతున్న యుద్ధానికి బ్రేక్ ప‌డే అవ‌కాశం ఉంది.

ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ హ‌తం..

ఓవైపు కాల్పుల విర‌మ‌ణ ప్ర‌తిపాద‌న‌పై చ‌ర్చ‌లు సాగుతున్న‌ప్ప‌టికీ దాడులు మాత్రం ఆగ‌డం లేదు. సోమ‌వారం తెల్ల‌వారుజామున టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా భీక‌ర దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ (IRGC Intelligence Chief) మ‌జీద్ ఖాదేమీ (Majid Khademi) హ‌త‌మ‌య్యారు. ఈ విష‌యాన్ని ఇరాన్ ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ ధృవీక‌రించింది. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కానీ, ఆయ‌న ఎప్పుడు, ఎక్క‌డ మ‌ర‌ణించార‌న్న వివ‌రాలు మాత్రం ఐఆర్‌జీసీ వెల్ల‌డించ‌లేదు. టెహ్రాన్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని నివాస స‌ముదాయాల‌పై జ‌రిగిన వైమాని దాడుల్లో ఆయ‌న మ‌ర‌ణించి ఉంటార‌ని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

Also Read..

అయోధ్య‌లో మ‌రో అద్భుత ఘ‌ట్టం.. శ్రీ‌రామ యంత్రం ప్ర‌తిష్ట‌.. దీని ప్ర‌త్యేక‌తేంటంటే..?

ఢిల్లీ అసెంబ్లీలో భారీ భద్రతా వైఫల్యం: కారుతో గేటును బద్దలు కొట్టి, స్పీకర్ కారుపై సిరా చల్లిన దుండగుడు

ఇరాన్‌తో వార్‌.. రూ.931 కోట్ల విలువైన త‌మ‌ విమానాన్ని స్వ‌యంగా పేల్చేసిన అమెరికా.. ఎందుకంటే..?

Advertisement
Advertisement