Explosions In Dubai | ఇరాన్ డ్రోన్ల దాడి.. భారీ శబ్దాలతో దద్దరిల్లిన దుబాయ్ నగరం
Explosions In Dubai | దుబాయ్పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో భారీ పేలుడు శబ్దాలతో నగరం దద్దరిల్లింది. డౌన్టౌన్లోని క్రీక్ హార్బర్లో గల ఓ టవర్పై డ్రోన్ దాడి జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది.
International | Published On Mar 12, 2026, 2.54 pm IST
Explosions In Dubai | వరుసగా 12వ రోజూ పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తోంది. తాజాగా దుబాయ్పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో భారీ పేలుడు శబ్దాలతో నగరం దద్దరిల్లింది. డౌన్టౌన్లోని క్రీక్ హార్బర్లో గల ఓ టవర్పై డ్రోన్ దాడి జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. ఈ దాడిలో బిల్డింగ్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిసింది. మరోవైపు ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు దుబాయ్ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు యూఏఈ (UAE) తెలిపింది.
ఇదిలా ఉండగా దుబాయ్తోపాటూ బహ్రెయిన్లోని ముహర్రాక్ ద్వీపంపై ఇరాన్ దాడి చేసింది. ఈ కారణంగా అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ఎయిర్పోర్టుతోపాటూ చమురు పరిశ్రమకు చెందిన భారీ ఇంధన ట్యాంకులు ఉన్నట్లు గల్ఫ్ మీడియా నివేదించింది. మరోవైపు కువైట్లో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు ఆదేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గల్ఫ్లోని ఇంధన వనరులే టార్గెట్..
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్లోని ఇంధన వనరులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాక్ సమీపంలోని రెండు ఆయిల్ ట్యాంకర్లపై రాత్రిపూట టెహ్రాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
యుద్ధం ముగింపునకు ఇరాన్ షరతులు ఇవీ..
యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. అందుకు మూడు షరతులు (Iran Conditions) విధించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు (Iranian president) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian ) సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ ద్వారా రాజుకున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు మూడు మార్గాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో తమ దేశంపై ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మూడింటికీ ఒప్పుకుంటే యుద్ధానికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్ ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
ఆ దేవుడే నన్ను రక్షించాడు.. హత్యాయత్నం ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా
సంబంధిత వార్తలు

Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని చనిపోయారా..? ఎక్స్ ట్రెండింగ్లో నెతన్యాహు ఈజ్ డెడ్ హ్యాష్ట్యాగ్
మార్చి 14, 2026

Anand Mahindra | అతిథి దేవో భవ.. యుద్ధం వేళ ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్
మార్చి 9, 2026

MEA | గల్ఫ్ నుంచి 52వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.. వెల్లడించిన ఎంఈఏ..
మార్చి 8, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



