త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

TG Speaker | పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ కమిటీల పాత్ర అత్యంత కీలకమని, రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్‌ ఛాంబర్‌లో మంగళవారం శాసనసభ ప్రభుత్వ హామీల అమలు కమిటీ (అష్యూరెన్సెస్), నియమాల కమిటీ (రూల్స్), నైతిక విలువల కమిటీ (ఎథిక్స్) తొలి సమావేశాలు నిర్వహించారు.

P

Telangana | Published On Jul 28, 2026, 8.30 pm IST

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
Advertisement

TG Speaker | పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ కమిటీల పాత్ర అత్యంత కీలకమని, రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్‌ ఛాంబర్‌లో మంగళవారం శాసనసభ ప్రభుత్వ హామీల అమలు కమిటీ (అష్యూరెన్సెస్), నియమాల కమిటీ (రూల్స్), నైతిక విలువల కమిటీ (ఎథిక్స్) తొలి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు.

ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ పటోళ్ల సంజీవరెడ్డి, సభ్యులు జె. అనిరుధ్‌రెడ్డి, జారే ఆదినారాయణ పాల్గొన్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన రూల్స్ కమిటీ సమావేశానికి సభ్యులు దానం నాగేందర్, తూడి మేఘారెడ్డి, భూక్యా మురళీనాయక్ హాజరయ్యారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యుడు జి. మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి కూడా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ పటోళ్ల సంజీవరెడ్డి, ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును పర్యవేక్షించే బాధ్యత హామీల కమిటీపై ఉంటుందని, ఆ దిశగా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

శాసనసభ సక్రమంగా, సమర్థవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడంలో రూల్స్ కమిటీ పాత్ర కీలకమని స్పీకర్ పేర్కొన్నారు. శాసనసభ పనితీరు కేవలం చట్టాల ద్వారానే కాకుండా, వాటిని రూపొందించే ప్రజాప్రతినిధుల ప్రవర్తన, నిబద్ధత, వ్యవహారశైలిని బట్టి కూడా అంచనా వేయబడుతుందని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ వ్యవస్థల్లో నైతిక విలువల కమిటీలు ఏర్పాటయ్యాయని స్పీకర్ పేర్కొన్నారు. అన్ని కమిటీలు నిష్పక్షపాత ధోరణితో విధులు నిర్వహించాలని సూచించారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కమిటీల చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ సభ్యులకు ముందుగా అందజేసేది రూల్స్ బుక్‌నేనని, దాని ఆధారంగానే స్పీకర్ సభను నిర్వహిస్తారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూల్స్ బుక్‌లో మార్పులు జరిగాయని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కమిటీ సభ్యులంతా కలిసి సమగ్ర నిబంధనలతో కొత్త రూల్స్ బుక్‌ను రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల శాసనసభలను అధ్యయనం చేసి అక్కడ అమలవుతున్న విధానాలను పరిశీలించాలని, అవసరమైన సూచనలు స్వీకరించాలని కమిటీలకు మంత్రి సూచించారు. సభలో నియమ నిబంధనల అమలుతో పాటు శాసనసభ హుందాతనాన్ని కాపాడటంలో ఎథిక్స్ కమిటీ కీలక పాత్ర పోషించాలని, కమిటీ నిర్ణయాలు పారదర్శకంగా ఉండి తెలంగాణకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కమిటీల చైర్మన్లు మాట్లాడుతూ శాసనసభ తమపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ సభ గౌరవాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement