త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AIIMS Delhi Population Counter | క్షణక్షణం.. లైవ్‌లో దేశ జనాభా.. రోడ్డుపై డిజిటల్ బోర్డు ఏర్పాటు

సోషల్ మీడియాలో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి ముందు ఉన్న ఒక డిజిటల్ బోర్డు తెగ వైరల్ అవుతోంది. క్షణక్షణానికి మారుతున్న భారత జనాభాను ఇది లైవ్‌లో చూపిస్తోంది.

J

Viral news | Published On Sep 7, 2026, 5.07 pm IST

AIIMS Delhi Population Counter | క్షణక్షణం.. లైవ్‌లో దేశ జనాభా.. రోడ్డుపై డిజిటల్ బోర్డు ఏర్పాటు
Advertisement
  • ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రి వెలుపల ఏర్పాటు చేసిన ఓ డిజిటల్ డిస్‌ప్లే వైరల్
  • భారతదేశ జనాభాను ఏ క్షణానికి ఆ క్షణం లైవ్‌గా చూపిస్తున్న పాపులేషన్ కౌంటర్
  • తాజాగా ఈ బోర్డులో దేశ జనాభా 1.48 బిలియన్ల (148 కోట్లు) మార్కును దాటేసింది
  • నిరంతరం మారుతున్న ఈ నంబర్ల వీడియోను నెటిజన్లు రికార్డ్ చేసి షేర్ చేయడంతో నెట్టింట హల్చల్

AIIMS Delhi Population Counter | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆస్పత్రి వెలుపల ఉన్న ఓ డిజిటల్ బోర్డు (Digital board) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బోర్డులో మన దేశ జనాభాకు సంబంధించిన లైవ్ కౌంటింగ్ చూపిస్తుండటంతో దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా ఆస్పత్రుల ముందు హెల్త్ టిప్స్ లేదా ఆస్పత్రి సేవల వివరాలను డిస్‌ప్లే చేస్తారు. కానీ ఢిల్లీ ఎయిమ్స్ ముందు మాత్రం వినూత్నంగా ఇండియా పాపులేషన్ (India Population) లైవ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏ క్షణానికి ఆ క్షణం దేశంలో జనాభా సంఖ్య ఎంత మేర పెరుగుతుందనే అంచనా డేటాతో ఈ లైవ్ కౌంటర్ నిరంతరం నడుస్తోంది.

తాజాగా ఈ డిజిటల్ డిస్‌ప్లేలో (Digital display) భారత జనాభా ఏకంగా 1.48 బిలియన్ల మార్కును (అంటే సుమారు 148 కోట్లు) దాటేసింది. సెకన్ల వ్యవధిలోనే డిస్‌ప్లేపై నంబర్లు వేగంగా మారిపోతుండటం చూసి అక్కడికి వెళ్లిన వారు ఆసక్తిగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేస్తున్నారు. మన దేశ జనాభా పెరుగుదల వేగాన్ని కళ్లారా చూపిస్తున్న ఈ లైవ్ పాపులేషన్ ట్రాకర్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement