త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jhansi Reel Tragedy | రీల్స్ పిచ్చి : డ్యామ్ పైనుంచి 30 అడుగుల కిందకు దూకేసిన యువకుడు.. విరిగిన రెండు కాళ్లు

సోషల్ మీడియాలో రీల్స్ మోజు ఓ యువకుడిని ఆస్పత్రి పాలు చేసింది. యూపీలో డ్యామ్ పైనుంచి 30 అడుగుల కిందకు దూకడంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి.

J

Viral news | Published On Sep 7, 2026, 4.28 pm IST

Jhansi Reel Tragedy | రీల్స్ పిచ్చి : డ్యామ్ పైనుంచి 30 అడుగుల కిందకు దూకేసిన యువకుడు.. విరిగిన రెండు కాళ్లు
Advertisement
  • ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం ఓ యువకుడి సాహసం
  • రీల్ కోసం ఏకంగా 30 అడుగుల పైనుంచి డ్యామ్ నీళ్లలోకి దూకిన 32 ఏళ్ల పుష్పేంద్ర కుమార్
  • అక్కడ నీళ్లు తక్కువగా ఉండి, నేరుగా కింద ఉన్న బండరాళ్లపై పడటంతో రెండు కాళ్లు ఫ్రాక్చర్
  • ప్రస్తుతం ఒక కాలికి సర్జరీ పూర్తి కాగా, మరో కాలికి ఆపరేషన్ చేయనున్న డాక్టర్లు

Jhansi Reel Tragedy | త్రినేత్ర.న్యూస్ : సోషల్ మీడియాలో (Social media) ఒకే ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోవాలనే పిచ్చి యువతను ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం ఝాన్సీలో రీల్ (Reel) కోసం ఏకంగా 30 అడుగుల ఎత్తు నుంచి ఓ డ్యామ్‌లోకి దూకిన 32 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు.

ఝాన్సీకి చెందిన పుష్పేంద్ర కుమార్ అనే 32 ఏళ్ల యువకుడు స్థానికంగా ఉన్న పహుజ్ డ్యామ్ (Pahuj Dam) వద్దకు వెళ్లాడు. అక్కడ సోషల్ మీడియా కోసం ఓ స్టంట్ వీడియో రికార్డ్ చేయాలనుకున్నాడు. ముందు వెనుక ఏమాత్రం ఆలోచించకుండా డ్యామ్ పైనుంచి సుమారు 30 అడుగుల కింద ఉన్న నీళ్లలోకి దూకేశాడు.

అయితే, డ్యామ్‌లో ఆ ప్రాంతంలో నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. పైనుంచి వేగంగా దూకేయడంతో.. అతను నేరుగా నీటి అడుగున ఉన్న బండరాళ్లపై పడ్డాడు. దీంతో పుష్పేంద్ర కుమార్ రెండు కాళ్లు తీవ్రంగా ఫ్రాక్చర్ (Fracture) అయ్యాయి. అతడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడి ఒక కాలికి సర్జరీ (Surgery) పూర్తి చేశారని, త్వరలోనే మరో కాలికి కూడా ఆపరేషన్ (Operation) చేయాల్సి ఉందని సమాచారం. కొద్దిపాటి లైక్స్, వ్యూస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ఈ ఘటన చూసిన నెటిజన్లు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement