త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | బైక్‌పై ఐదుగురు యువకులు ఎక్కి నడిరోడ్డుపై స్టంట్.. 31 వేల ఫైన్ వేసిన పోలీసులు

నడిరోడ్డుపై ఇలాంటి స్టంట్లు చేస్తూ చాలామంది ఈ మధ్య వైరల్ అవుతున్నారు. కావాలని సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం, రీల్స్ కోసం యువత ఎక్కువగా ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేయడం పరిపాటిగా మారింది.

J

Viral news | Published On Dec 24, 2025, 3.55 pm IST

Viral Video | బైక్‌పై ఐదుగురు యువకులు ఎక్కి నడిరోడ్డుపై స్టంట్.. 31 వేల ఫైన్ వేసిన పోలీసులు
Advertisement

Viral Video | ఒకరు కాదు ఇద్దరు కాదు.. బైక్‌పై ఏకంగా ఐదుగురు యువకులు ఎక్కి స్టంట్ చేయడం మొదలు పెట్టారు. నడిరోడ్డుపై ట్రాఫిక్ ఉన్నా ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్లు చేసిన డేంజరస్ స్టంట్స్‌కి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరకు రూ.31 వేల ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది.

నేషనల్ హైవే 9 మీద ఒక్క బైక్ మీద ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. అందులో ఒక యువకుడు అయితే బైక్‌కి లెఫ్ట్ సైడ్ నిలబడి ఉన్నాడు. చెప్పాలంటే ఇది డేంజరస్ స్టంట్. ఆ బైక్ వెనుక వెళ్తున్న ఓ వాహనదారుడు వాళ్ల డేంజరస్ స్టంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ట్రాఫిక్ పోలీసుల కంట పడటంతో వెంటనే బైక్ నెంబర్ ఆధారంగా ఆ బైక్ ఓనర్ ఎవరో తెలుసుకొని రూ.31 వేల ఫైన్ వేశారు.

నడిరోడ్డుపై ఇలాంటి స్టంట్లు చేస్తూ చాలామంది ఈ మధ్య వైరల్ అవుతున్నారు. కావాలని సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం, రీల్స్ కోసం యువత ఎక్కువగా ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి స్టంట్స్ చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి జైలు శిక్ష కూడా విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rahul Singh (@immrahulsingh)

Advertisement

తాజావార్తలు

Advertisement