Dharmapuri | ధర్మపురిలో విషాదం.. మహిళ ప్రాణం తీసిన కోతుల కొట్లాట
Dharmapuri | జగిత్యాల జిల్లా ధర్మపురిలో (Dharmapuri) విషాదం చోటుచేసుకుంది. కోతుల కొట్లాటలో (Monkey Fight) ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. ధర్మపురి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కొనపర్తి సత్యనారాయణ, పద్మ దంపతులు ఉంటున్నారు.
Dharmapuri | త్రినేత్ర.న్యూస్: జగిత్యాల జిల్లా ధర్మపురిలో (Dharmapuri) విషాదం చోటుచేసుకుంది. కోతుల కొట్లాటలో (Monkey Fight) ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. ధర్మపురి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కొనపర్తి సత్యనారాయణ, పద్మ దంపతులు ఉంటున్నారు. బుధవారం సాయంత్రం పద్మ తమ ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఇంటిపై కప్పిన రేకులపై చేరిన కోతులు కోట్లాడుకోసాగాయి.
ఈక్రమంలో రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన ఓ సిమెంటు ఇటుకను కిందికి తోసేశాయి. దీంతో అది కింద కూర్చున్న పద్మ తలపై పడింది. ఎత్తు నుంచి అది పడటంతో పద్మ తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. కళ్లముందే పద్మ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనే..
గత కోలంగా ధర్మపురిలో కోతుల వీరంగం సృష్టిస్తున్నాయి. తరచూ దాడులకు దిగుతున్నాయి. ఎటువైపు నుంచి ఏ కోతి వచ్చి మీద పడుతుందోనని స్థానికులు భయపడిపోతున్నారు. ఎటు చూసినా కోతుల గుంపే కనిపిస్తుండటంతో వణికిపోతున్నారు. పట్టణానికి చెందిన ఓ మహిళ గతంలో కోతుల భయంతో మిద్దె పైనుంచి పడి మృతి చెందింది.
తాజావార్తలు
- ●EPF | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలాఖరు వరకు ఖాతాల్లో వడ్డీ జమ..
- ●Revanth Reddy | పేపర్లెస్గా మంత్రివర్గ సమావేశాలు.. డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం
- ●Vande Mataram | వందేమాతరాన్ని పక్కన పెట్టిన విజయ్ ప్రభుత్వం.. తమిళ గేయంతో అసెంబ్లీ ప్రారంభం
- ●Bankers | బ్యాంకర్లూ, జాగ్రత్త.. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు: ఆర్బీఐ కొత్త ఆదేశాలు
- ●KTR | పిల్లలతో ఉంటే ఆ ఆనందమే వేరు
- ●Jeevan Reddy | రైతులను ఇక్కట్లకు గురిచేసేలా ప్రభుత్వ తీరు.. ధాన్యం కొనుగోలుపై భరోసానివ్వాలి: టీ.జీవన్ రెడ్డి

EPF | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలాఖరు వరకు ఖాతాల్లో వడ్డీ జమ..

Revanth Reddy | పేపర్లెస్గా మంత్రివర్గ సమావేశాలు.. డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం

Vande Mataram | వందేమాతరాన్ని పక్కన పెట్టిన విజయ్ ప్రభుత్వం.. తమిళ గేయంతో అసెంబ్లీ ప్రారంభం

Bankers | బ్యాంకర్లూ, జాగ్రత్త.. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు: ఆర్బీఐ కొత్త ఆదేశాలు






