త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uday Krishna Reddy | మేమిద్ద‌రం పెండ్లి చేసుకోవాలనుకున్నాం.. కానీ ఆమె మరొక‌రిని వివాహం చేసుకుంది..

Uday Krishna Reddy | 2025 జూన్ నుంచి తామిద్ద‌రం రిలేష‌న్‌లో ఉన్నామ‌ని, వివాహం కూడా చేసుకోవాల‌నుకున్నామ‌ని ఉద‌య్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) వెల్ల‌డించారు. ఆమెకు ఆర్థికంగా కూడా స‌హాయం చేశాన‌న్నారు. కానీ ఆమె ఓ ఐఏఎస్‌ ఆఫీస‌ర్‌ను పెండ్లి చేసుకుంద‌ని చెప్పారు. ఆమెకు వివాహం అయిన త‌ర్వాత కూడా త‌మ ఇద్ద‌రి మ‌ధ్య శారీర‌కంగా, భావోద్వేగ‌ప‌రంగా సంబంధం కొన‌సాగింద‌ని తెలిపారు.

G

Telangana | Published On Jul 22, 2026, 10.48 am IST

Uday Krishna Reddy | మేమిద్ద‌రం పెండ్లి చేసుకోవాలనుకున్నాం.. కానీ ఆమె మరొక‌రిని వివాహం చేసుకుంది..
Advertisement

Uday Krishna Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: నేషనల్ పోలీసు​ అకాడమీలో(NPA) మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతున్న‌ది. టైనీ ఐపీఎస్ ఎం. దుయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నార‌ని, లైంగిక వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని క‌ర్ణాట‌క‌కు చెందిన వివాహిత అయిన మ‌హిళా ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) ఆరోపించిన విష‌యం తెలిసిందే. అయితే 2025 జూన్ నుంచి తామిద్ద‌రం రిలేష‌న్‌లో ఉన్నామ‌ని, వివాహం కూడా చేసుకోవాల‌నుకున్నామ‌ని ఉద‌య్ కృష్ణారెడ్డి వెల్ల‌డించారు. ఆమెకు ఆర్థికంగా కూడా స‌హాయం చేశాన‌న్నారు. కానీ ఆమె ఓ ఐఏఎస్‌ ఆఫీస‌ర్‌ను పెండ్లి చేసుకుంద‌ని చెప్పారు. మ‌ళ్లీ అనుబంధాన్ని కొన‌సాగించాల‌ని త‌న‌ను కోరుతూ వ‌చ్చార‌ని పేర్కొన్నారు.

ఆమెకు వివాహం అయిన త‌ర్వాత కూడా త‌మ ఇద్ద‌రి మ‌ధ్య శారీర‌కంగా, భావోద్వేగ‌ప‌రంగా సంబంధం కొన‌సాగింద‌ని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారంగా త‌న ఐఫోన్‌లో వీడియోలు రికార్డు చేశాన‌ని, వాటిని ఆమె భ‌ర్త‌కు పంపించిన‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు అత్తాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో త‌న‌పై న‌మోదైన కేసును కొట్టివేయాల‌ని కోరుతూ ఉద‌య్ కృష్ణారెడ్డి హైకోర్టులో (High Court) దాఖ‌లు చేసిన పిటిష‌న్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారు తొలుత అకాడమీ అధికారులకు, తరువాత ఠాణాలో ఫిర్యాదు చేశారన్నారు. రెండింటిలోనూ భిన్నమైన ఆరోపణలున్నాయని తన పిటిషన్​లో వివరించారు. ఈ నేప‌థ్యంలో విచారణ లేకుండా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఉదయ్​ కృష్ణారెడ్డి కోరారు.

కాగా, ఇప్ప‌టికే ఉద‌య్ కృష్ణారెడ్డిపై ఎన్‌పీఏ వేటు వేసిన విష‌యం తెలిసిందే. అత‌నిపై న‌మోదైన కేసు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ను ఉన్న‌తాధికారులు మ‌హిళా భ‌ద్ర‌తా విభాగానికి (Women Safety Wing) అప్ప‌గించారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్‌ జాదవ్‌ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న‌ది. సోమవారం ఉదయం అపస్మారకస్థితిలో ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేటు ద‌వాఖాన‌లో చేరిన ఉదయ్‌కృష్ణారెడ్డి ఆరోగ్యం కుదుటపడినట్లు సమాచారం. బుధవారం ఆయన్ను హాస్పిటల్​ నుంచి డిశ్ఛార్జి చేయనున్నట్టు తెలిసింది. అయితే అత‌డు ఎలాంటి విషపదార్థం తీసుకోలేదని మెడికల్ చెకప్​లో తేలింది. దీంతో కేసును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే నిందితుడు ఇలా చేసిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అత‌డు కోలుకున్నాక వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మ‌రోవైపు సీసీటీవీ ఫుటేజ్‌, ఇరుప‌క్షాల వాట్స‌ప్ చాటింగ్‌లు, మొబైల్ డేటాను సేక‌రించే ప‌నిలోప‌డ్డారు.

Advertisement
Advertisement