త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mulkanoor Constable FIR | ప్రభుత్వ టీచర్‌ను వేధించిన కానిస్టేబుల్.. కోర్టు ఎంట్రీతో సీన్ రివర్స్!

హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌ను వేధించిన కానిస్టేబుల్‌కు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పీఎస్‌లో న్యాయం దక్కకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించింది.

J

Telangana | Published On Jun 29, 2026, 4.22 pm IST

Mulkanoor Constable FIR | ప్రభుత్వ టీచర్‌ను వేధించిన కానిస్టేబుల్.. కోర్టు ఎంట్రీతో సీన్ రివర్స్!
Advertisement
  • హన్మకొండ జిల్లా ముల్కనూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యాకుబ్‌పై కేసు నమోదు
  • తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వ టీచర్ స్టాలిన్ బేగ్
  • పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. BNSS సెక్షన్ 175 కింద FIR నమోదుకు ఆదేశం
  • కోర్టు ఉత్తర్వులతో కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ముల్కనూర్ పోలీసులు

Mulkanoor Constable FIR | త్రినేత్ర.న్యూస్ : హన్మకొండ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఓవరాక్షన్‌కు కోర్టు బ్రేకులు వేసింది. సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని తీవ్రంగా వేధించిన ఘటనలో ఏకంగా న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.

అసలేం జరిగిందంటే?

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌లో ఎండీ యాకుబ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, మహమ్మద్ స్టాలిన్ బేగ్ అనే ప్రభుత్వ టీచర్‌ను యాకుబ్ కొద్ది రోజులుగా తీవ్రంగా దూషిస్తూ, మానసిక వేధింపులకు (Mental Harassment) గురిచేస్తున్నాడు. కానిస్టేబుల్ తీరుతో తీవ్రంగా విసిగిపోయిన బాధితుడు.. న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. కానీ, ఫిర్యాదు చేసింది తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిపైనే కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు.

కోర్టును ఆశ్రయించిన బాధితుడు

పోలీస్ స్టేషన్‌లో తనకు న్యాయం జరగదన్న విషయం అర్థం చేసుకున్న బాధితుడు.. నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు జరుగుతున్న అన్యాయంపై, కానిస్టేబుల్ యాకుబ్ పెడుతున్న ఇబ్బందులపై కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ దాఖలు చేశాడు.

కానిస్టేబుల్‌పై కేసు నమోదుకు ఆదేశం

ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదును ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తీవ్రంగా పరిగణించారు. ఫిర్యాదులోని అంశాలను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం.. బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 175 ప్రకారం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, వెంటనే రిపోర్ట్ సబ్‌మిట్ చేయాలని ముల్కనూర్ ఎస్‌హెచ్‌వో (SHO) గట్టిగా ఆదేశించింది.

పోలీస్ శాఖలో హాట్ టాపిక్

కోర్టు నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రావడంతో ముల్కనూర్ పోలీసులు దిగివచ్చారు. వెంటనే కానిస్టేబుల్ యాకుబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ అధికారిపైనే కోర్టు జోక్యంతో వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement