త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఉత్తమ్.. ఆ ఉత్త‌రం గుర్తుందా..?: హ‌రీశ్‌రావు

Harish Rao | టీపీసీసీ (TPCC) అధ్యక్షుడిగా 30-03-2016న ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పీకర్‌ (Speaker)కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా అని బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత‌ హ‌రీశ్‌రావు (Harish Rao) ప్ర‌శ్నించారు.

A

Telangana | Published On Jan 3, 2026, 11.08 am IST

Harish Rao | ఉత్తమ్.. ఆ ఉత్త‌రం గుర్తుందా..?: హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | టీపీసీసీ (TPCC) అధ్యక్షుడిగా 30-03-2016న ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పీకర్‌ (Speaker)కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా అని బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. “అసెంబ్లీలో ఆడియో–విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. అందుకే మేము సభకు హాజరుకాబోము” అని లేఖ రాశార‌ని గుర్తు చేశారు. అదే ఉత్త‌మ్ నేడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో ప్రజెంటేషన్‌కు సిద్ధపడటం, రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమ‌ని మండిప‌డ్డారు. ఆ ఉత్తరంపై నేటి ఉపముఖ్యమంత్రి (Deputy CM) అయిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), పద్మావతి కూడా సంతకాలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనైతికతను, ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడానికి ఈ ఒక్క ఉత్తరం చాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంట్ స్పూర్తి లాంటి మాటలు వల్లెవేస్తారని, అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు నైజమ‌ని విమ‌ర్శించారు. ప్రజెంటేషన్‌కు అధికార పక్షానికి అనుమతి ఇస్తే బీఆర్ఎస్‌కూ అదే విధంగా అనుమతి ఇవ్వాలని బీఏసీ సమావేశంలో స్పీకర్‌ను, ఉత్తరం ద్వారా కూడా కోరామ‌ని చెప్పారు. అయినా ఆ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించార‌ని పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్న అసలు తేడా అని వివ‌రించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అన్ని సంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగానికే తూట్లు పొడవడాన్ని తన “మార్పు”గా చూపిస్తోందని ఆరోపించారు. ఆ “మార్పు” అసలు అర్థం ఏమిటో ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement