News Paper Reading | ప్రభుత్వ పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పనిసరి
News Paper Reading | విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో వార్తా పత్రిక పఠనం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.
News Paper Reading | త్రినేత్ర.న్యూస్ : విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో వార్తా పత్రిక పఠనం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు పదజాలంపై అవగాహన పెరగడంతో పాటు పుస్తక పఠనం అలవాటు మెరుగుపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31న రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో 10 నిమిషాల పాటు వార్తా పత్రికలను చదివించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పిల్లలకు కరెంట్ అఫైర్స్పై అవగాహన ఏర్పడుతుంది. దాంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏం జరుగుతుందనే దానిపై చర్చకు ఆస్కారం ఉంటుందని, తద్వారా సామాజిక అంశాలపై అవగాహన ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇందుకు ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కచ్చితంగా రెండు న్యూస్ పేపర్లను విధిగా వేయించుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఒకటి ఇంగ్లీష్, మరొకటి హిందీ పత్రిక ఉండాలని తెలిపింది. ఇక గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కూడా కచ్చితంగా రెండు హిందీ పేపర్లను వేయించుకోవాలని ఆదేశించింది. ఈ ఖర్చులను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భరిస్తుందని తెలిపింది.
ప్రతి రోజు రెండు న్యూస్ పేపర్లలోని ఓ కొత్త ఐదు పదాలను గుర్తించి.. వాటికి అర్థం చెప్పేందుకు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని ఆదేశించింది. దీంతో విద్యార్థులకు భాషపై పట్టు వస్తుందని తెలిపింది. ఉదయం పూట ప్రార్థనా సమయంలో హిందీ, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లను విద్యార్థుల చేత గట్టిగా చదివి వినిపించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీంతో పాటు తరగతి గదుల్లో కూడా వార్తా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్, జాతీయ, అంతర్జాతీయ, క్రీడలకు సంబంధించి వార్తలపై చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కార్యక్రమాలతో విద్యార్థుల్లో సామాజిక స్పృహ, జనరల్ నాలెడ్జ్ పెంపొందడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
సంబంధిత వార్తలు

NEET UG | రూ.10 లక్షలు పెట్టి పేపర్ కొంటే.. వచ్చింది 107 మార్కులే..
మే 17, 2026

NEET 2026 paper leak | నీట్ ప్రశ్నపత్రం లీక్..? అసలు పరీక్షా పత్రంతో సరిపోలిన మెటీరియల్లోని 140 ప్రశ్నలు
మే 11, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



