త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | గొర్రెల వ్యాన్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియ‌ని వాహ‌నం.. ఇద్ద‌రు మృతి

Road Accident | హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను గొర్రెలను తరలిస్తున్నారు.

S

Telangana | Published On Jul 17, 2026, 12.32 pm IST

Road Accident | గొర్రెల వ్యాన్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియ‌ని వాహ‌నం.. ఇద్ద‌రు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను గొర్రెలను తరలిస్తున్నారు. వీరికి నిద్ర రావ‌డంతో త‌మ వాహ‌నాన్ని ఓఆర్ఆర్‌పై ప‌క్క‌కు ఆపి నిద్రలోకి జారుకున్నారు. అదే స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన ఓ వాహ‌నం.. గొర్రెల వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో గొర్రెల‌ను త‌ర‌లిస్తున్న మెద‌క్ జిల్లా వాసులు రాములు(60), రషీద్(40) అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement