Hydrogen Train | పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
Hydrogen Train | త్రినేత్ర.న్యూస్ : భారతీయ రైల్వేలో (Indian Railways) సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు (Hydrogen Train) అందుబాటులోకి వచ్చింది.
Hydrogen Train | త్రినేత్ర.న్యూస్ : భారతీయ రైల్వేలో (Indian Railways) సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు (Hydrogen Train) అందుబాటులోకి వచ్చింది. హర్యానాలోని జింద్లో (Jind) ఈ రైలు పట్టాలెక్కింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) జెండా ఊపి రైలు సేవలను అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 10 కోచ్లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు. జింద్-సోనిపట్ (Jind-Sonipat) మార్గంలో ఇది రాకపోకలు సాగించనుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లలో రైలు ఆగుతుంది. సుమారు 90 కి.మీ. దూరం గల ఈ మార్గాన్ని కేవలం ఒక గంటలో చేరుకోనుంది.
ఇక ఈ రైల్లో మొత్తం 682 సీట్లు ఉంటాయి. ఒకేసారి 2600 మంది ఇందులో ప్రయాణించొచ్చు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్ధ్యంతో దీనిని తయారుచేసినప్పటికీ 75 కిలోమీటర్లకే పరిమితం చేశారు. ప్రతిరోజు జింద్-సోనిపట్ మధ్య రెండు ట్రిప్పులు నడువనుంది. ఈ రైలు కోసం జింద్లో ప్రత్యేకంగా హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే కంప్రెస్డ్ హైడ్రోజన్ ఫ్యూయల్ని రైలులో నింపుతారు.
#WATCH | Jind, Haryana: Prime Minister Narendra Modi flags off the country's first hydrogen-powered train from Jind to Sonipat
(Video source: DD) pic.twitter.com/kMQv2nBhOZ
— ANI (@ANI) July 17, 2026
ఇవీ రైలు ప్రత్యేకతలు..
ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో 1,200-కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్ను అమర్చారు. ఫ్యూయల్ సెల్ సాంకేతికత ద్వారా హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్తో కలిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఈ రైలు ద్వారా ఎలాంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకు వస్తాయి. మేక్ ఇన్ ఇండియా, హరిత రవాణా మిషన్లో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో రూ. 89 కోట్ల అంచనా వ్యయంతో దీనిని రూపకల్పన చేశారు. ఒకసారి హైడ్రోజన్ను నింపితే ఈ రైలు సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ రైల్లో టికెట్ ధరలు కూడా చాలా తక్కువే. సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. రూ. 5 నుంచి రూ. 25 మధ్య నిర్ణయించారు.
ఈ రైలులో సుమారు 27 హైడ్రోజన్ సిలిండర్లను అమర్చారు. హైడ్రోజన్ లీకేజీని గుర్తించే డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు, ఆధునిక నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిని అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర మార్గాల్లో కూడా ఇలాంటి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ఈ రైలు రాకతో.. హైడ్రోజన్ శక్తితో నడిచే ప్యాసింజర్ రైలును నడిపే దేశాల జాబితాలో భారత్ చేరింది. ఇప్పటికే ఈ తరహా రైళ్లు జర్మనీ, జపాన్, చైనా, అమెరికాలో నడుస్తున్నాయి.
Also Read..
దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు జైషే టెర్రరిస్టులు అరెస్ట్
గిగాబైట్ మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ల్యాప్టాప్.. భారత్లోనే తయారీ..
ఒక్క రోజులోనే రూ.7,600 తగ్గిన బంగారం ధర.. పెట్టుబడులు పెట్టవచ్చా..?
తాజావార్తలు
- ●GIGABYTE | గిగాబైట్ మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ల్యాప్టాప్.. భారత్లోనే తయారీ..
- ●NICL Assistant Recruitment | నేషనల్ ఇన్సూరెన్స్లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు..
- ●Gujarat ATS | దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు జైషే టెర్రరిస్టులు అరెస్ట్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.7,600 తగ్గిన బంగారం ధర.. పెట్టుబడులు పెట్టవచ్చా..?
- ●Train Hits School Van | ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్ను ఢీ కొట్టిన రైలు.. పలువురు మృతి
- ●Suicide | పిల్లలను బావిలో తోసి.. ఆపై తానూ దూకి తల్లి ఆత్మహత్య

GIGABYTE | గిగాబైట్ మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ల్యాప్టాప్.. భారత్లోనే తయారీ..

NICL Assistant Recruitment | నేషనల్ ఇన్సూరెన్స్లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు..

Gujarat ATS | దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు జైషే టెర్రరిస్టులు అరెస్ట్

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.7,600 తగ్గిన బంగారం ధర.. పెట్టుబడులు పెట్టవచ్చా..?






