Hyderabad | హైదరాబాద్లో బాలికలు, మహిళలపై నానాటికీ పెరుగుతున్న నేరాలు..
Hyderabad | హైదరాబాద్లో (Hyderabad) బాలికలు, యువతులపై నానాటికీ నేరాలు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 17 ఏండ్ల యువతిని ప్రేమ పేరుతో వేధించిన ఓ వ్యక్తి.. తనపై పోక్సో కేసు (POCSO Case) పెట్టిందన్న కోపంతో బాధితురాలితో సహా ఆరుగురిని చంపిన విషయం తెలిసిందే. తాజాగా గత రెండు రోజుల్లోనే రాజధానిలో విద్యార్థినులను వేధించిన కేసులు మూడు నమోదయ్యాయి.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్లో (Hyderabad) బాలికలు, యువతులపై నానాటికీ నేరాలు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 17 ఏండ్ల యువతిని ప్రేమ పేరుతో వేధించిన ఓ వ్యక్తి.. తనపై పోక్సో కేసు (POCSO Case) పెట్టిందన్న కోపంతో బాధితురాలితో సహా ఆరుగురిని చంపిన విషయం తెలిసిందే. తాజాగా గత రెండు రోజుల్లోనే రాజధానిలో విద్యార్థినులను వేధించిన కేసులు మూడు నమోదయ్యాయి.
బడికి వెళ్తున్న బాలికపై
సనత్నగర్ (Sanathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్కూల్కు వెళ్తున్న బాలికను వెంబడించిన షాబాబ్ అనే వ్యక్తి.. ఆమెను బలవంతంగా బైక్పై ఎక్కించుకుని సనత్నగర్ పరిధిలోని ఒక పార్కుకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైందికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు అఘాయిత్యానికి సంబంధించిన వివరాలను తల్లిదండ్రులకు చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాబాబ్పై పోక్సో కేసు (POCSO Case) నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.

9 ఏండ్ల బాలికతో అసభ్యంగా..
కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఎఫ్ బ్లాక్లో 9 ఏండ్ల బాలికతో ఓ వ్యక్తి అసభ్యంగా (Assault) ప్రవర్తించాడు. నీలోఫర్ దవాఖాన (Niloufer Hospital) వద్ద చాయ్ విక్రయిస్తూ జీవనం సాగించే హజీజ్ అబ్దుల్ అనే వ్యక్తి నాలుగో తరగతి చదువుతున్న బాలికకు ముద్దు పెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అదికాస్తా బయటకు రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతా కలిసి నిందితుడిపై దాడి చేయడంతో హజీజ్ తీవ్రంగా గాయడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

9వ తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడి ప్రేమ..
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన దంపతులు హైదరాబాద్లోని మూసాపేట జనతానగర్లో నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. కూలి పనిచేసుకుని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమార్తె(14) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. అదే స్కూల్లో పోలాకి నరేశ్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాల సమయం ముగిశాక విద్యార్థులకు ట్యూషన్ సైతం చెప్పేవాడు. ఈ క్రమంలో సదరు బాలికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను మందలించారు. బుధవారం పాఠశాలకు వెళ్లిన వారు.. తమ కుమార్తెను నరేష్ ప్రేమ పేరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
గురువారం ఉదయం స్కూల్కి వెళ్లిన బాలిక.. మధ్యాహ్నం భోజనం చేయలేదు. దీంతో తోటి విద్యార్థులు అడగడంతో కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఉపాధ్యాయులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వరుసకు సోదరుడైన వ్యక్తితో మధ్యాహ్నం 3 గంటలకు బాలికను ఇంటికి పంపారు. అయితే ఇంటికి వెళ్లిన బాలిక.. నరేశ్కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. ఆందోళనకు గురైన అతడు బాలిక పెద్దమ్మకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. వారంతా ఇంటికెళ్లి చూడగా అప్పటికే ఆమె ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

DGP Anand | సైబర్ ఆర్థిక నష్టాలు 20 శాతం తగ్గాయ్.. ఏఐ సైబర్ కాల్ సెంటర్ పనితీరు బాగుంది
జులై 16, 2026

KTR | కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం.. విద్యార్థుల యువజన సభలో అన్నీ చెబుదాం
జులై 16, 2026

Telangana | మేడమ్.. 700 మంది అమ్మాయిలకు రెండే టాయిలెట్లు.. ఇదీ గిరిజన బాలికల ఆవేదన
జులై 16, 2026
తాజావార్తలు
- ●Monsoon Deficit | ముఖం చాటేసిన వరుణుడు
- ●RRB Recruitment | సికింద్రాబాద్ రైల్వే జోన్లో సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ పోస్టులు
- ●Donald Trump | ఫిఫా వరల్డ్కప్ ఫైనల్కు ట్రంప్.. విజేతకు ట్రోఫీ అందించనున్న యూఎస్ ప్రెసిడెంట్
- ●Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్కు చివరిదేనా?.. జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!
- ●Covid-19 | మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్.. నలుగురు మృతి
- ●Hydrogen Train | నేడు దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Monsoon Deficit | ముఖం చాటేసిన వరుణుడు

RRB Recruitment | సికింద్రాబాద్ రైల్వే జోన్లో సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ పోస్టులు

Donald Trump | ఫిఫా వరల్డ్కప్ ఫైనల్కు ట్రంప్.. విజేతకు ట్రోఫీ అందించనున్న యూఎస్ ప్రెసిడెంట్

Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్కు చివరిదేనా?.. జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!



