త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | స్కూల్‌ను చీపురుతో శుభ్రం చేసిన బండి సంజ‌య్.. సిరిసిల్ల ఎస్పీపై రుస‌రుస‌లు

Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజ‌య్( Bandi Sanjay ) రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మ‌హేశ్‌పై రుసరుస‌లాడారు. నేను వస్తే ఎస్పీ ఎందుకు రాలేదు.. నేను కార్య‌క‌ర్త‌ను అనుకుంటున్నాడా..? అని స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన ఓ పోలీసు అధికారిని బండి సంజ‌య్ నిల‌దీశారు.

S

Telangana | Published On Jun 13, 2026, 12.50 pm IST

Bandi Sanjay | స్కూల్‌ను చీపురుతో శుభ్రం చేసిన బండి సంజ‌య్.. సిరిసిల్ల ఎస్పీపై రుస‌రుస‌లు
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర మంత్రి బండి సంజ‌య్ రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మ‌హేశ్‌పై రుసరుస‌లాడారు. నేను వస్తే ఎస్పీ ఎందుకు రాలేదు.. నేను కార్య‌క‌ర్త‌ను అనుకుంటున్నాడా..? అని స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన ఓ పోలీసు అధికారిని బండి సంజ‌య్ నిల‌దీశారు.

ఈ దేశానికి ప్ర‌ధానిగా మోదీ సేవ‌లందించి పుష్క‌ర కాలం అవుతున్న సంద‌ర్భంగా బీజేపీ నేత‌లు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. క‌రీంన‌గ‌ర్ సేవ‌లో భాగంగా మ‌న బ‌డి - మన బాధ్య‌త కార్య‌క్ర‌మం కింద సిరిసిల్ల కుసుమ రామ‌య్య ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను బండి సంజ‌య్ సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను బండి సంజ‌య్ చీపురుతో శుభ్రం చేశారు. ప్ర‌తి త‌ర‌గ‌తి గ‌దిలోని బెంచీల‌ను, ఫ్లోర్‌ను నీటితో క‌డిగారు కేంద్ర మంత్రి. సంజ‌య్‌తో పాటు బీజేపీ నేత‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. బండి సంజ‌య్ పాఠ‌శాల‌ను శుభ్ర‌ప‌రిచిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement