త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో INTUC, ఏఐటీయూసీ పూర్తిగా విఫ‌లం: క‌విత‌

Kavitha | కార్మికుల స‌మ‌స్య‌లను ప‌రిష్కరించ‌డంలో ఐఎన్‌టీయూసీ (INTUC), ఏఐటీయూసీ (AITUC) పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయని టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) విమ‌ర్శించారు. తాము అధికారంలోకి రాగానే సింగ‌రేణి కార్మికుల స‌మ‌స‌ల‌న్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

G

Telangana | Published On Jun 18, 2026, 12.51 pm IST

Kavitha | కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో INTUC, ఏఐటీయూసీ పూర్తిగా విఫ‌లం: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: కార్మికుల స‌మ‌స్య‌లను ప‌రిష్కరించ‌డంలో ఐఎన్‌టీయూసీ (INTUC), ఏఐటీయూసీ (AITUC) పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయని టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) విమ‌ర్శించారు. తాము అధికారంలోకి రాగానే సింగ‌రేణి కార్మికుల స‌మ‌స‌ల‌న్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. సింగరేణి బాయిబాట (Singareni Baibata) కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని ఓసిపి-3 ప్రాజెక్టును కవిత సందర్శించారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్మికులను స్వయంగా కలిసిన ఆమె, వారి కష్టసుఖాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రామగుండం OCP-3 వద్ద నిర్వ‌హించిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ.. కోల్ బెల్ట్ ప్రాంత కార్మికులు ఆశీర్వదించిన వారే అధికారంలోకి వస్తారన్నారు.

హెచ్ఎంఎస్ (HMS) సంఘంతో కలిసి సింగరేణి కార్మికుల సొంతింటి కలను కచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారు. గతంలో కార్మికులు కోల్పోయిన హక్కులను తిరిగి తీసుకువస్తామని వెల్ల‌డించారు. సింగరేణిలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్ ఉద్యోగాల ప్రక్రియను పునరుద్ధరిస్తామన్నారు. మిగతా సంఘాలు సమస్యలపై కేవలం ప్రశ్నించి వదిలేస్తాయ‌ని, పరిష్కారం చూపవని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement