త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | పార్ల‌మెంట్ స‌మావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్న‌య్‌.. అమిత్ షా హౌస్‌లోకి వస్త‌లేరు

Chamala Kirankumar Reddy | పార్ల‌మెంట్ స‌మావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నాయ‌ని.. విద్యార్థుల‌పై పెల్లెట్ గ‌న్స్ పేల్చ‌మ‌ని ఎవ‌రు ఆర్డ‌ర్ ఇచ్చారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌స‌భ‌కు వ‌చ్చి స‌మాధానం చెప్పాల‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల‌పై జ‌రిగిని లాఠీచార్జ్‌పై ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు.

S

Telangana | Published On Aug 10, 2026, 1.02 pm IST

Chamala Kirankumar Reddy | పార్ల‌మెంట్ స‌మావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్న‌య్‌.. అమిత్ షా హౌస్‌లోకి వస్త‌లేరు
Advertisement
  • ఆయ‌న‌ లోక్‌స‌భ‌కు వ‌చ్చి పెల్లెట్ గ‌న్స్ పేల్చ‌మ‌ని ఎవ‌రు ఆర్డ‌ర్ ఇచ్చారో స‌మాధానం చెప్పాలి
  • విద్యార్థుల‌పై జ‌రిగిన లాఠీచార్జ్‌పై క్ష‌మాప‌ణ చెప్పాలి
  • భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్

Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్: పార్ల‌మెంట్ స‌మావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నాయ‌ని.. విద్యార్థుల‌పై పెల్లెట్ గ‌న్స్ పేల్చ‌మ‌ని ఎవ‌రు ఆర్డ‌ర్ ఇచ్చారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌స‌భ‌కు వ‌చ్చి స‌మాధానం చెప్పాల‌ని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల‌పై జ‌రిగిని లాఠీచార్జ్‌పై ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జ‌రిగిన‌ లాఠీచార్జ్ అంశంపై అమిత్ షా లోక్‌సభలో సమాధానం చెప్పాలని పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు సోమ‌వారం నిరసన చేప‌ట్టారు. అమిత్ షా సభకు హాజరు కానీ తేదీలతో కూడిన ప్లకార్డులను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా చామ‌ల మాట్లాడారు.

విప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్త‌లేరు..

స‌మావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నా అమిత్ షా హౌస్‌లోకి రావడం లేదు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో అమిత్ షా సమాధానం చెప్పాలి. కేంద్రం బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ పెడితే ఆ బిల్లుల ఆమోదానికి సంబంధించి ప్రతిపక్షాలుగా నిర్ణయం తీసుకుంటాం. విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్రం తనకు కావాల్సిన బిల్లులను పాస్ చేయించుకోవాలని చూస్తోంది. కేంద్రం ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంట్‌ను నడపాలి అని ఎంపీ చామ‌ల సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement