TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి సమీక్షలో సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన తొమ్మిది కీలక పనితీరు ప్రమాణాల్లో రాష్ట్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు వెల్లడించారు.
- టీజీసీఎస్బీ పనితీరును అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్
TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రధాని కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి సమీక్షలో సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన తొమ్మిది కీలక పనితీరు ప్రమాణాల్లో రాష్ట్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు వెల్లడించారు. ఈ విజయానికి కృషి చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయెల్తో పాటు నగర పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)ను ఏర్పాటు చేసి సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని డీజీపీ పేర్కొన్నారు. రూ.5 లక్షలకు పైబడిన సైబర్ మోసాల కేసుల్లో 49 ఈ-జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం ద్వారా వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సైబర్ నేరాల ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రం 88 శాతం విజయశాతాన్ని నమోదు చేయగా, బాధితులకు మోసపోయిన నగదు తిరిగి అందించడంలో 81 శాతం మేర ఫలితాలు సాధించినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘సహయోగ్’ (SAHYOG) పోర్టల్ వినియోగంలోనూ తెలంగాణ 88 శాతం పనితీరు కనబరిచిందన్నారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరాలపై సమర్థవంతమైన నిఘా కోసం 5,500 మంది నేరస్థుల ప్రొఫైళ్లను అప్లోడ్ చేయడంతో పాటు 15 వేల అంతర్రాష్ట్ర నేర సంబంధాలను గుర్తించినట్లు తెలిపారు. సైబర్ దర్యాప్తు సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ‘సైట్రైన్’ (CyTrain) ద్వారా 524 మంది పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్లు వెల్లడించారు.
దేశంలో సైబర్ నేరాలకు కేంద్రాలుగా గుర్తింపు పొందిన ప్రధాన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు స్థానం లేకపోవడం రాష్ట్ర పోలీసుల సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు ఇప్పటివరకు 8.5 లక్షల మందికి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, డిజిటల్ అరెస్ట్ మోసాలపై మరో రెండు లక్షల మందికి ప్రత్యేకంగా చైతన్యం కల్పించినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్లో తెలంగాణ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో సైబర్ నేరాల నియంత్రణలో మరింత సమర్థంగా పనిచేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Congress Whip | ఆ మూడురోజులు పార్లమెంట్కు రావాలి.. సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
ఆగస్టు 7, 2026

Ajinkya Rahane | పశ్చాత్తాపం లేదు.. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తితో ఉన్నా : అజింక్య రహానే
ఆగస్టు 7, 2026

Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Sreeleela | ప్రియుడి కోసం జాన్వీకపూర్తో శ్రీలీల ఫైట్ - ఒకే అబ్బాయితో ఇద్దరు ప్రేమలో పడ్డారా?
- ●Neha Bora | నేహా బోరాపై ఇంకుతో దాడి.. దేశ వ్యతిరేకి అంటూ నినాదాలు
- ●Meta Platforms | మెటా ప్లాట్ఫామ్స్ ఒక పబ్లిక్ న్యూసెన్స్.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థకు రూ.5400 కోట్ల జరిమానా..
- ● ఆ ఒక్క క్లిక్తో ఖజానా ఖాళీ: 'Boss Scam' పేరుతో చెలరేగుతున్న డిజిటల్ గ్యాంగ్స్!
- ●PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ
- ●Allahabad High Court | ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?

Sreeleela | ప్రియుడి కోసం జాన్వీకపూర్తో శ్రీలీల ఫైట్ - ఒకే అబ్బాయితో ఇద్దరు ప్రేమలో పడ్డారా?

Neha Bora | నేహా బోరాపై ఇంకుతో దాడి.. దేశ వ్యతిరేకి అంటూ నినాదాలు

Meta Platforms | మెటా ప్లాట్ఫామ్స్ ఒక పబ్లిక్ న్యూసెన్స్.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థకు రూ.5400 కోట్ల జరిమానా..

ఆ ఒక్క క్లిక్తో ఖజానా ఖాళీ: 'Boss Scam' పేరుతో చెలరేగుతున్న డిజిటల్ గ్యాంగ్స్!



