త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మ‌న్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ స‌భ్యుడిగా కిర‌ణ్ కుమార్

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నికైంది. బార్ కౌన్సిల్ నూత‌న చైర్మ‌న్‌గా సాముల రామ్ రెడ్డి, వైస్ చైర్మ‌న్‌గా చిల‌కాని వెంక‌ట్ యాద‌వ్ ఎన్నిక‌య్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కిరణ్ కుమార్ గ‌న్న‌మ‌నేని ఎన్నిక‌య్యారు.

S

Telangana | Published On Sep 13, 2026, 7.53 pm IST

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మ‌న్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ స‌భ్యుడిగా కిర‌ణ్ కుమార్
Advertisement

Telangana Bar Council | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ బార్ కౌన్సిల్ నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నికైంది. బార్ కౌన్సిల్ నూత‌న చైర్మ‌న్‌గా సాముల రామ్ రెడ్డి, వైస్ చైర్మ‌న్‌గా చిల‌కాని వెంక‌ట్ యాద‌వ్ ఎన్నిక‌య్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కిరణ్ కుమార్ గ‌న్న‌మ‌నేని ఎన్నిక‌య్యారు. ఈ ముగ్గురికి మిగ‌తా స‌భ్యులు, ప‌లువురు లాయ‌ర్లు అభినంద‌న‌లు తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల ఆకాంక్షలు, సంక్షేమ అంశాలను జాతీయ స్థాయిలో సమర్థవంతంగా ప్రతిబింబించేలా వీరిసేవలు కొనసాగాలని ఆకాంక్షించారు.

నూతన నాయకత్వం న్యాయవాదుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, జూనియర్ న్యాయవాదుల సంక్షేమం, సీనియర్ న్యాయవాదుల గౌరవం, న్యాయవాదుల భద్రత, వృత్తిపరమైన స్వాతంత్య్రం, సంక్షేమ పథకాలు, న్యాయవాద వృత్తి అభివృద్ధికి అవ‌స‌ర‌మైన వాటి కోసం కృషి చేయాల‌ని కోరారు.

Advertisement
Advertisement