త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kamareddy Student | లండన్‎లో కామారెడ్డి జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి

Kamareddy Student | ఉన్న‌త విద్యకోసం లండ‌న్ (London) వెళ్లిన కామారెడ్డి యువ‌కుడు (Kamareddy Student) అనుమాన‌స్ప‌ద స్థితిలో (suspicious death) మృతిచెందాడు.

G

Telangana | Published On Jun 26, 2026, 12.20 pm IST

Kamareddy Student | లండన్‎లో కామారెడ్డి జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి
Advertisement

Kamareddy Student | త్రినేత్ర‌.న్యూస్‌: ఉన్న‌త విద్యకోసం లండ‌న్ (London) వెళ్లిన కామారెడ్డి యువ‌కుడు (Kamareddy Student) అనుమాన‌స్ప‌ద స్థితిలో (suspicious death) మృతిచెందాడు. బ‌ర్త్ డే పార్టీకి వెళ్లి, తెల్లారే స‌రికి శ‌వ‌మై క‌నిపించ‌డంతో అత‌ని మృతిపై అనుమానం నెల‌కొన్న‌ది.

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ రెడ్డి (Srinath Reddy-25) ఎమ్మెస్ చదివేందుకు 14 నెలల క్రితం లండన్ వెళ్లాడు. లీసెస్టర్ నగరంలోని ఓ యూనివర్శిటీలో ఎమ్మెస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్ర‌మంలో గురువారం బర్త్ డే పార్టీ (Birthday Party) ఉండటంతో ఫ్రెండ్ రూమ్‎కు వెళ్లాడు. రాత్రి ఫ్రెండ్ రూములోనే పడుకున్నాడు. ఉదయం స్నేహితుడు వచ్చి చూసేసరికి శ్రీనాథ్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. దీంతో వారు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరుతున్నారు.

Advertisement
Advertisement