త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sangameshwara Temple | కృష్ణాన‌దికి పోటెత్తిన వ‌ర‌ద‌.. సంగ‌మేశ్వ‌ర ఆల‌యం పూర్తిగా జలాధివాసం.. ఫొటోలు

Sangameshwara Temple | కృష్ణాన‌దికి (Krishna River) భారీగా వ‌ర‌ద పోటెత్త‌డంతో సంగమేశ్వ‌ర ఆల‌యం (Sangameshwara Temple) పూర్తిగా నీట‌మునిగింది. రెండు రోజుల క్రితమే ఆల‌యం కృష్ణ‌మ ఒడికి చేరిన విష‌యం తెలిసిందే.

G

Telangana | Published On Aug 5, 2026, 10.56 am IST

Sangameshwara Temple | కృష్ణాన‌దికి పోటెత్తిన వ‌ర‌ద‌.. సంగ‌మేశ్వ‌ర ఆల‌యం పూర్తిగా జలాధివాసం.. ఫొటోలు
Advertisement

Sangameshwara Temple | త్రినేత్ర‌.న్యూస్‌: కృష్ణాన‌దికి (Krishna River) భారీగా వ‌ర‌ద పోటెత్త‌డంతో సంగమేశ్వ‌ర ఆల‌యం (Sangameshwara Temple) పూర్తిగా నీట‌మునిగింది. రెండు రోజుల క్రితమే ఆల‌యం కృష్ణ‌మ ఒడికి చేరిన విష‌యం తెలిసిందే. అయితే ఆల‌యం నీట మునిగిన‌ప్ప‌టికీ శిఖ‌రం బ‌య‌ట‌కు క‌నిపిస్తుండేది. కాగా, శ్రీశైలం ప్రాజెక్ట్‌కు (Srisailam Dam) జూరాల‌, తుంగ‌భ‌ద్ర నుంచి పెద్ద మొత్తంలో వ‌ర‌ద వ‌స్తుండ‌టంతో బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు క‌నిపించిన ఆల‌య శిఖ‌రం.. 2 గంట‌ల్లోనే పూర్తిగా నీటిలోకి వెళ్లిపోయింది. ఈనేప‌థ్యంలో బోటులో వెల్లిన వేద పండితులు ఆల‌య శిఖ‌రానికి చివ‌రి పూజ‌లు చేశారు. కాగా, శ్రీశైలంలో నీటిమ‌ట్టం ప‌డిపోవ‌డంతో ఈ ఏడాది మార్చిలో సంగ‌మేశ్వ‌ర ఆల‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆల‌య అర్చ‌కులు స్వామివారికి పూజ‌లు ప్రారంభించారు.

అయితే కృష్ణా న‌దిలో మ‌ళ్లీ వ‌ర‌ద ప్ర‌వాహం ఆరంభం కావ‌డంతో శ్రీశైలం క్ర‌మంగా  (Srisailam Back Water) నిండుతున్న‌ది. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 1న ఆల‌యంలోకి నీరు చేరింది. ఈ నెల 3న ఆల‌య శిఖ‌రం వ‌రకు మునిగిపోయింది. దీంతో గంగ‌మ్మ‌కు అర్చ‌కులు చీర‌, సారె స‌మ‌ర్పించారు. ఇక మ‌రో ఎనిమిది నెల‌ల‌పాటు సంగ‌మేశ్వ‌రుడు కృష్ణ‌మ్మ (Krishna River) ఒడిలోనే ఉండిపోనున్నారు. కాగా, గతేడాది జూన్ 15వ తేదీనే సంగమేశ్వర స్వామి గర్భాలయంలోకి నీరు ప్రవేశించగా.. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది సంగమేశ్వర స్వామి వారు 131 రోజుల పాటు పూజలు అందుకున్నారు.

Advertisement
Advertisement