Sama Ramnohan Reddy | రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుతున్నారు.. హరీశ్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం
Sama Ramnohan Reddy | రాష్ట్ర ప్రజలు సర్వనాశనం కావాలని హరీశ్ రావు (Harish Rao) తాంత్రిక, క్షుద్రపూజలు చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ramnohan Reddy) విమర్శించారు. తాము అధికారంలో లేము కాబట్టి రాష్ట్రం సర్వ నాశనం కావాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు.
Sama Ramnohan Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రజలు సర్వనాశనం కావాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) తాంత్రిక, క్షుద్రపూజలు చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ramnohan Reddy) విమర్శించారు. తాము అధికారంలో లేము కాబట్టి రాష్ట్రం సర్వ నాశనం కావాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. నేటి నుంచి హరీశ్ రావు పేరు తాంత్రిక హరీశ్ రావు అంటూ ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 2న తిరుచిరాపల్లిలో హరీశ్ రావు తాంత్రిక పూజలు చేశారన్నారు. మే 31 నుంచి జూన్ 1 వరకు శివమొగ్గలో క్షుద్రపూజలు చేశారని, జూన్ 20న తిరుచ్చిలో జయగోరి కాళీ పూజలు, జూలై 23న శివమొగ్గలో క్షుద్రపూజలు చేశారని ఆరోపించారు.
తాంత్రిక పూజలు ఎవరి కోసం..
తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం హరీశ్ రావుకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎవరి కోసం తాంత్రిక పూజలు చేస్తున్నాడన్నారు. ఎవరికి కీడు చేయాలని ఆ పూజలు చేస్తున్నారని, దీనిపై హరీశ్ రావు స్పందించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కూడా హరీశ్ రావు పూజలపై సమాధానం చెప్పాలన్నారు. రైతులు ఏడ్వాలనే దురుద్దేశంతో పుల్లలు పెట్టాలని హరీశ్ రావు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. తాము ఉంటే రాష్ట్రం ఉండాలి, లేదంటే ఉండొద్దనేలా ప్రతి పక్ష నాయకుల వికృత చేష్టలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను, రైతులను, మహిళలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి చంపించిన హంతకులు వాళ్లని చెప్పారు. ప్రజలు వాళ్ల ట్రాప్లో పడొద్దని, ఇలాంటి దుర్మాగులను సామాజిక బహిష్కరణ చేయాలన్నారు.
వర్షాలు పడొద్దని మొక్కుతున్నారు..
వర్షాలు రావాలని పూజలు చేసే వాళ్లను చూశామని, కానీ రైతులు ఏడవాలని హరీశ్ రావు దరిద్రపు తాంత్రిక పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు పడొద్దని బీఆర్ఎస్ నేత ప్రకాశ్ స్వయంగా మీడియాలో మొక్కుకుంటున్నారని చెబుతూ వీడియో ప్లే చేసి చూపించారు. తెలంగాణను అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని తాంత్రిక పూజలు ఏమి చేయలేవన్నారు. దేవుడు మంచి చేసే వాళ్లతో ఉంటాడని, రైతులు, మహిళలు, యువకులు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని చెప్పారు.
తాజావార్తలు
- ●Nani - Nithiin | నాని నిర్మాత...నితిన్ హీరో - అలియాస్ రుక్మిణి టైటిల్ గ్లింప్స్ రిలీజ్
- ●JioTag 2 | జియో కొత్త ట్రాకింగ్ డివైస్.. కేవలం రూ.1249 మాత్రమే..
- ●Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద భూనిర్వాసితుల ఆందోళన.. వీర్లపాలెంలో ఉద్రిక్తత
- ●Protest | 19 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వండి.. ఇందిరాపార్క్ చౌరస్తాలో ఉద్యోగార్థుల ధర్నా
- ●Trading | ట్రేడింగ్ను వృత్తిగా స్వీకరిస్తున్నారా.. సెబీ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే..
- ●Parliament Monsoon Session | అటు జెన్ జీ.. ఇటు అయోధ్య.. బీజేపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి

Nani - Nithiin | నాని నిర్మాత...నితిన్ హీరో - అలియాస్ రుక్మిణి టైటిల్ గ్లింప్స్ రిలీజ్

JioTag 2 | జియో కొత్త ట్రాకింగ్ డివైస్.. కేవలం రూ.1249 మాత్రమే..

Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద భూనిర్వాసితుల ఆందోళన.. వీర్లపాలెంలో ఉద్రిక్తత

Protest | 19 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వండి.. ఇందిరాపార్క్ చౌరస్తాలో ఉద్యోగార్థుల ధర్నా






